శ్రామిక్ రైళ్లలో టికెట్ రేట్ ఎంత.? బోగికి ఎంతమంది.?
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులు, తీర్థ యాత్రికులు, విద్యార్థులు వంటి వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు అనుమతించిన ప్రత్యేక శ్రామిక్ స్పెషల్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం నడిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ రైళ్లలో ప్రత్యేక ఆంక్షలు ఏంటి.? టికెట్ ఎంత.? ఎలాంటి నిబంధనలు రూపొందించారన్న పలు ఆసక్తికరమైన విషయాలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. వలస కూలీల కోసం శుక్రవారం నాడు 6 […]
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులు, తీర్థ యాత్రికులు, విద్యార్థులు వంటి వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు అనుమతించిన ప్రత్యేక శ్రామిక్ స్పెషల్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం నడిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ రైళ్లలో ప్రత్యేక ఆంక్షలు ఏంటి.? టికెట్ ఎంత.? ఎలాంటి నిబంధనలు రూపొందించారన్న పలు ఆసక్తికరమైన విషయాలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. వలస కూలీల కోసం శుక్రవారం నాడు 6 ప్రత్యేక రైళ్లను నడిపామని స్పష్టం చేశారు. అంతేకాకుండా నేటి నుంచి 300కు పైగా రైళ్లను నడుపుతామని ప్రకటించారు. ఇక ఈ రైళ్లలో దూరంతో సంబంధం లేకుండా రూ.50 టికెట్ ధర నిర్ణయించామని చెప్పారు. మరోవైపు ఈ శ్రామిక్ రైళ్లలో ఒక్కో బోగికి 54 మందిని అనుమతించారు. అంతేకాకుండా ప్రయాణీకుల మధ్య వ్యక్తిగత దూరం ఉండేలా బెర్తులు తొలగించారు. అటు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఇక ఎక్స్ప్రెస్లో ధర రూ.50 కాగా, సూపర్ఫాస్ట్ రైళ్లలో రూ.20 అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అన్ని రాష్ట్రా ప్రభుత్వాల కోరిక మేరకే లాక్డౌన్ను పొడిగించామని కిషన్ రెడ్డి తెలిపారు.
Read More:
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..
షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…
మసీదులో సామూహిక ప్రార్ధనలు.. అంతలోనే మహిళా తహశీల్దార్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే.!
గ్రేటర్లో కరోనా టెర్రర్.. పల్లీల వ్యాపారి ద్వారా ఏకంగా..