AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధానిలో తొలి ‘ప్లాస్మా బ్యాంక్’ ప్రారంభం..

భారత్‌లో తొలి ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమైంది. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న రోగుల‌కు ప్లాస్మా థెర‌పీ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు ఈ థెర‌పీ ప‌నికొస్తుందని తేలటంతో..

రాజధానిలో తొలి ‘ప్లాస్మా బ్యాంక్’ ప్రారంభం..
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2020 | 4:53 PM

Share

భారత్‌లో తొలి ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటి సారిగా ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్. గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆయ‌న ఈ బ్యాంక్‌ను ప్రారంభించారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న రోగుల‌కు ప్లాస్మా థెర‌పీ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు ఈ థెర‌పీ ప‌నికొస్తుందని తేలటంతో ఢిల్లీలో బ్లడ్ బ్యాంక్ తరహాలో ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించినట్లుగా సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్బంగా సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చే దాతలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలను ఈ సందర్బంగా సీఎం వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు…’కోవిడ్-19 నుంచి కోలుకుని, 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు, 50 కిలోలకు పైగా బరువు ఉన్న వ్యక్తులు కోవిడ్ పేషెంట్ల కోసం ప్లాస్మా డొనేట్ చేయవచ్చు. మధుమేహం, రక్తపోటు, కేన్సర్స్‌తో బయటపడిన వారు, లివర్, కిడ్నీ, హృద్రోగ సమస్యలు ఉన్న వారు ప్లాస్మా డొనేట్ చేయరాదని చెప్పారు.

ఇక, ఢిల్లీలోని  స్థానికులు ఎవరైన ప్లాస్మాను దానం చేయ‌ద‌ల‌చుకున్నవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచారు. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చే వారు  1031 నంబ‌ర్‌కు గానీ, లేదా 8800007722 నంబ‌ర్‌కు వాట్సాప్ చేయ‌వ‌చ్చునని చెప్పారు. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్ ఆధ్వ‌ర్యంలో ఈ ప్లాస్మా బ్యాంక్ న‌డుస్తుంది. దాతలు సిద్ధంగా ఉంటే వారు ప్లాస్మాను దానం చేసేందుకు అర్హులో, కాదో వైద్య సిబ్బంది నిర్ణ‌యించి.. దాని ప్ర‌కారం ప్లాస్మాను తీసుకుంటారు. ప్లాస్మాను దానం చేసే వారి కోసం ఢిల్లీ ప్ర‌భుత్వం ఉచితంగా ర‌వాణా స‌దుపాయం కూడా అందిస్తోంది.

Follow Us
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
రూ.79,999కే Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్క ఛార్జ్‌తో 301కి.మీ
రూ.79,999కే Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్క ఛార్జ్‌తో 301కి.మీ
నమ్మశక్యం కాని ఫీచర్లతో Mivi డ్యుయోపాడ్స్‌.. వివరాలివే
నమ్మశక్యం కాని ఫీచర్లతో Mivi డ్యుయోపాడ్స్‌.. వివరాలివే
జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి..
జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి..
జిమ్‌లో వ్యాయామంచేస్తూ.. యువతకు అకస్మాత్తుగా గుండెపోటు! కారణం ఇదే
జిమ్‌లో వ్యాయామంచేస్తూ.. యువతకు అకస్మాత్తుగా గుండెపోటు! కారణం ఇదే
ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు
ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు
స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్‌ బ్యాండ్.. వివరాలు తెలుసా
స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్‌ బ్యాండ్.. వివరాలు తెలుసా
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
తలనొప్పికి మాత్ర వేస్తే.. నొప్పి ఎక్కడుందో మందుకు ఎలా తెలుస్తుంది
తలనొప్పికి మాత్ర వేస్తే.. నొప్పి ఎక్కడుందో మందుకు ఎలా తెలుస్తుంది