AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నిధుల కోసం WHO లైవ్‌.. భాగం కానున్న భారతీయ నటులు వీరే..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనాను ఎలాగైనా కట్టడి చేయాలని దేశాధినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.

కరోనా నిధుల కోసం WHO లైవ్‌.. భాగం కానున్న భారతీయ నటులు వీరే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 07, 2020 | 11:04 AM

Share

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనాను ఎలాగైనా కట్టడి చేయాలని దేశాధినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఈ మహమ్మారికి సోకకుండా ఉండేందుకు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. మరోవైపు కరోనాపై ఎప్పటికప్పుడు దేశాలను అప్రమత్తం చేస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ఈ వైరస్‌పై పోరుకు నిధులను సేకరించే పనిలో పడింది. ఈ క్రమంలో టాప్ సెలబ్రిటీలతో ఈ నెల 18న లైవ్ ఈవెంట్ పెట్టేందుకు సిద్ధమైంది.

ఈ ఈవెంట్‌లో జాన్ లెజండ్, లేడి గాగా, డేవిడ్ బెక్‌హమ్‌, ఎల్టన్ జాన్, ఐడ్రిస్ ఎల్బా తదితరులు భాగం కానున్నారు. వారితో పాటు భారత్‌ నుంచి కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్, దేవీ గర్ల్‌ ప్రియాంక చోప్రా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. ఇక ఈ షోకు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన స్టీఫెన్ కోల్బర్ట్, జిమ్మి ఫెలోన్‌, జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతలుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి WHO ఒక ప్రపంచం: ఇంటి వద్ద కలిసి(One World: Together at home)అనే క్యాప్షన్‌ను పెట్టింది. కాగా భారత్‌లోనూ కరోనాపై అవగాహన తీసుకొచ్చేందుకు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, రణ్‌బీర్ కపూర్, అలియా, ప్రియాంక తదితరులు కలిసి ఫ్యామిలీ అనే ఓ లఘు చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

Read This Story Also: తబ్లీగి జామాత్‌: హకీంపేట మజీదు ఇన్‌చార్జిపై క్రిమినల్ కేసు