AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..

లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న మందుబాబులకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే మద్యం దుకాణాలను తెరుస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే సోమవారం వెల్లడించారు. అయితే ఓ కండిషన్ ఉందని.. ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నప్పుడు మద్యంపై నిషేధం విధించకూడదని’ మంత్రి మీడియాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం […]

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..
Ravi Kiran
| Edited By: |

Updated on: Apr 21, 2020 | 2:32 PM

Share

లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న మందుబాబులకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే మద్యం దుకాణాలను తెరుస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే సోమవారం వెల్లడించారు. అయితే ఓ కండిషన్ ఉందని.. ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నప్పుడు మద్యంపై నిషేధం విధించకూడదని’ మంత్రి మీడియాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల రాష్ట్రమంతా మద్యం షాపులు మూతపడ్డాయి. అయితే లిక్కర్ సంస్థలు విడతల వారీగా షాపులు తెరవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన అన్నారు.

Also Read:గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. దాని వల్ల ఖజానాపై అధికభారం పడుతోందని భారత ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీల సమాఖ్య(సీఐఏబీసీ) మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాసింది. దశల వారీగా మద్యం షాపులను తెరవాలంటూ అందులో పేర్కొంది. అందువల్ల రెడ్ జోన్ కానీ ప్రదేశాల్లో మద్యం షాపులను దశల వారీగా తెరవాలని నిర్ణయించాం. మే 15 వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు.. అలాగే మే 15 నుంచి జూన్ 15 వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు.. ఇక జూన్ 15 తర్వాత నుంచి నార్మల్ టైమింగ్స్‌లో తెరవనివ్వాలని సీఐఏబీసీ కోరింది. ఇక దీనిపై ప్రభుత్వం చర్చించినట్లు తెలుస్తోంది. కాబట్టి రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

Also Read: కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..