Coronavirus: షాకింగ్.. ఒకే ఇంట్లో 26 మందికి కరోనా..!
దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 14వేలకు పైనే చేరింది. తాజాగా ఒకే కుటుంబంలో 26మందికి కరోనా సోకింది.
దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 14వేలకు పైనే చేరింది. తాజాగా ఒకే కుటుంబంలో 26మందికి కరోనా సోకింది. ఢిల్లీలోని జహంగిర్ పురి ప్రాంతంలో ఒకే కుటుంబంలోనే 26 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతం మొత్తాన్ని ఇప్పుడు కంటైన్మెంట్ జోన్గా గుర్తించి.. అధికారులు సీల్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 71 కంటైన్మెంట్ జోన్లను గుర్తించిందని.. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా బయటకు వస్తున్నారని కేజ్రీవాల్ వెల్లడించారు.
Read This Story Also: జగన్ నివాసం ఆ జోన్లో లేదు.. గుంటూరు కలెక్టర్ క్లారిటీ..!