కరోనాపై పోరు.. మాజీ నటి దంపతుల ఉదారభావం..!
కరోనావైరస్ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు చాలా మంది తమ ఉదారభావాన్ని చాటుకుంటున్నారు. తమకు తోచినంత సహాయం చేస్తూ కరోనాపై పోరులో మేమున్నామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భరోసా ఇస్తున్నారు
కరోనావైరస్ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు చాలా మంది తమ ఉదారభావాన్ని చాటుకుంటున్నారు. తమకు తోచినంత సహాయం చేస్తూ కరోనాపై పోరులో మేమున్నామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో మాజీ నటి అయేషా టకీయా తన ఉదారభావాన్ని చాటుకున్నారు. ముంబయిలో ఉన్న తమ గల్ఫ్ హోటల్ ఇన్ కొలాబాను కరోనా ఐసోలేషన్ వార్డు కోసం వాడుకోవాలంటూ అయేషా దంపతులు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే తమ రెస్టారెంట్ను బ్రిహాన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగించినట్లు సమాచారం. ఈ క్రమంలో ముంబయి పోలీసులు, రిలీఫ్ వర్కర్లు అక్కడ ఏర్పాట్లు మొదలెట్టినట్లు తెలుస్తోంది. కాగా అయేషా, నాగార్జున సరసన ‘సూపర్’ చిత్రంలో నటించింది. ఆ తరువాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించిన అయేషా.. 2009లో ఫర్హాన్ అజ్మీ వివాహం చేసుకున్నారు. 2011లో నటనకు గుడ్బై చెప్పిన ఈ భామ.. ప్రస్తుతం కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తోంది.
Read This Story Also: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఎదురుచూస్తోన్న బడా నిర్మాత.. ఎందుకంటే..!