AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో ఒక్కరోజే 61 కేసులు.. ఏపీలో…

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో.. తెలంగాణలో అనుహ్యంగా పెరగిపోయాయి. ఒక్కరోజులోనే 61 కేసులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య592కి చేరింది. ఇక సోమవారం కూడా కరోనాతో ఒకరు మరణించారు.దీంతో మృతుల సంఖ్య 17కి చేరుకుంది. ఇక ఏపీలో సోమవారం కొత్తగా మరో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో […]

తెలంగాణలో ఒక్కరోజే 61 కేసులు.. ఏపీలో...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 13, 2020 | 10:26 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో.. తెలంగాణలో అనుహ్యంగా పెరగిపోయాయి. ఒక్కరోజులోనే 61 కేసులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య592కి చేరింది. ఇక సోమవారం కూడా కరోనాతో ఒకరు మరణించారు.దీంతో మృతుల సంఖ్య 17కి చేరుకుంది.

ఇక ఏపీలో సోమవారం కొత్తగా మరో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరుకుంది. గుంటూరు జిల్లాలో మూడు, నెల్లూరు జిల్లాలో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలావుంటే.. ఇక తెలంగాణలో లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ రేపటితో ముగియనుండటంతో.. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. మరో రెండు వారాలపాటు ఈ లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.