AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

దాయాది పాకిస్తాన్ లో మతం అనేది చాలా సున్నితమైన అంశం. అక్కడ ముస్లింలు, మత పెద్దలు, ఇమామ్ లు చెప్పినట్లుగానే కొన్నిసార్లు పాక్ ప్రభుత్వం చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే రంజాన్ వేళ పలు షరతులతో మసీదులను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు పాక్ ప్రధాని. అయితే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ వాటిని తెరవడంతో.. దానికి తగిన మూల్యం చెల్లిస్తున్నారు. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇక పాకిస్తాన్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ కూడా […]

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..
Ravi Kiran
|

Updated on: Apr 27, 2020 | 2:32 PM

Share

దాయాది పాకిస్తాన్ లో మతం అనేది చాలా సున్నితమైన అంశం. అక్కడ ముస్లింలు, మత పెద్దలు, ఇమామ్ లు చెప్పినట్లుగానే కొన్నిసార్లు పాక్ ప్రభుత్వం చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే రంజాన్ వేళ పలు షరతులతో మసీదులను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు పాక్ ప్రధాని. అయితే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ వాటిని తెరవడంతో.. దానికి తగిన మూల్యం చెల్లిస్తున్నారు. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇక పాకిస్తాన్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ కూడా మసీదులను తెరవడం వల్లే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

గత ఆరు రోజుల్లో పాకిస్తాన్ లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ 13,328 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ బారిన పడి 281 మంది మృతి చెందారు. అంతేకాకుండా అక్కడ 200 మంది వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఇక ముస్లిం మత పెద్దల అల్టిమేటం వల్ల ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మసీదులపై నిషేధాన్ని ఎత్తివేశారని.. దీనితో సామూహిక ప్రార్ధనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అందుకే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని పీఐఎంఏ ప్రెసిడెంట్ వెల్లడించారు. కాగా, రంజాన్ వేళ మసీదులు తెరుచుకునేందుకు పాక్ ప్రభుత్వం పలు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సామాజిక దూరాన్ని తప్పనిసరి చేస్తూ.. సామూహిక ప్రార్ధనలు చేయకూడదని, అలాగే ప్రార్ధన చేసే చాపను ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలంటూ పలు సూచనలు చేసింది.

Read Also:

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

డేంజర్ బెల్స్: మే 18 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!

ఇల్లు చేరుకోవడానికి కూలీ మాస్టర్ ప్లాన్.. 25 వేల కేజీల ఉల్లితో..

Follow Us
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
రూ.79,999కే Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్క ఛార్జ్‌తో 301కి.మీ
రూ.79,999కే Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్క ఛార్జ్‌తో 301కి.మీ
నమ్మశక్యం కాని ఫీచర్లతో Mivi డ్యుయోపాడ్స్‌.. వివరాలివే
నమ్మశక్యం కాని ఫీచర్లతో Mivi డ్యుయోపాడ్స్‌.. వివరాలివే
జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి..
జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి..
జిమ్‌లో వ్యాయామంచేస్తూ.. యువతకు అకస్మాత్తుగా గుండెపోటు! కారణం ఇదే
జిమ్‌లో వ్యాయామంచేస్తూ.. యువతకు అకస్మాత్తుగా గుండెపోటు! కారణం ఇదే
ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు
ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు
స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్‌ బ్యాండ్.. వివరాలు తెలుసా
స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్‌ బ్యాండ్.. వివరాలు తెలుసా
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
తలనొప్పికి మాత్ర వేస్తే.. నొప్పి ఎక్కడుందో మందుకు ఎలా తెలుస్తుంది
తలనొప్పికి మాత్ర వేస్తే.. నొప్పి ఎక్కడుందో మందుకు ఎలా తెలుస్తుంది