పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..
ఒక వైపు లాక్ డౌన్.. మరో వైపు కరోనా వైరస్ మహమ్మారితో ప్రజలు అతలాకుతలం అవుతున్న తరుణంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సిబ్బందికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతీ నెలా రూ. 8,500 వేతనం చెల్లించనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై ప్రతీ నెలా ఒకటవ తేదీనే సిబ్బందికి వేతనాలు ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. ఇందుకై పంచాయతీలకు ప్రతి నెలా […]
ఒక వైపు లాక్ డౌన్.. మరో వైపు కరోనా వైరస్ మహమ్మారితో ప్రజలు అతలాకుతలం అవుతున్న తరుణంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సిబ్బందికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతీ నెలా రూ. 8,500 వేతనం చెల్లించనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై ప్రతీ నెలా ఒకటవ తేదీనే సిబ్బందికి వేతనాలు ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. ఇందుకై పంచాయతీలకు ప్రతి నెలా ఇచ్చే రూ. 336 కోట్ల నిధుల నుంచి సిబ్బంది వేతనాలు చెల్లించుకోవచ్చునని సూచించింది. కాగా, ఈ నిబంధనలను పాటించని పంచాయతీలపై తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవి చదవండి:
మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్ల అల్టిమేటం..