Watch Video: కూటమి మేనిఫెస్టోలో ‘ఫొటోల’ వివాదం.. పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
కూటమి మేనిఫెస్టోలో రెండు ఫొటోలే ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండటం, బీజేపీకి చెందిన వారి ఫొటో లేకపోవడంపై స్పందిస్తూ ఆయన స్పందించారు. ప్రజల జీవితాలు మారుస్తామంటూ కబుర్లు చెప్పారని.. కానీ ముగ్గురిలో ఒకరు సంతకం పెట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
కూటమి మేనిఫెస్టోలో రెండు ఫొటోలే ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండటం, బీజేపీకి చెందిన వారి ఫొటో లేకపోవడంపై స్పందిస్తూ ఆయన స్పందించారు. ప్రజల జీవితాలు మారుస్తామంటూ కబుర్లు చెప్పారని.. కానీ ముగ్గురిలో ఒకరు సంతకం పెట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోతో మోసం చేస్తున్నారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. గత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు అమలు చేస్తానంటున్న పథకాలకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామంటున్నారని.. ఈ సంపద ఎలా సృష్టిస్తారో చెప్పలేదన్నారు. 2014లానే ఇది కూడా దగా మేనిఫెస్టోగా ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలోని హామీలు నెరవేర్చడం సాధ్యంకాదనే బీజేపీ దీనికి దూరం జరిగిందని అన్నారు.
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

