ఓ వైపు వడగాల్పలు.. మరోవైపు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!
దేశంలో ఎండలు భగ్గుమంటున్నాయి. చాలా ప్రాంతాల్లో తవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేసాయి. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు బిహార్, జార్ఖండ్, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సైతం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులపాటు వడాగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది.
దేశంలో ఎండలు భగ్గుమంటున్నాయి. చాలా ప్రాంతాల్లో తవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేసాయి. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు బిహార్, జార్ఖండ్, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సైతం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులపాటు వడాగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో కేరళ, ఉత్తరప్రదేశ్లో, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, యానాంలోనూ వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. మరోవైపు జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా రాష్ట్రాలకు వాతావరణ శాఖ అరెంజ్ అలర్ట్ విడుదల చేసింది. ఇటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్ లలో సోమ, మంగళవారాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సిక్కింలో బుధవారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

