AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా విలయం.. ఇండియా.. 24 గంటల్లో.. పెరిగిన కేసులు 11,400

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. గత 24 గంటల్లో కొత్తగా 11,400 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 377 కి పెరిగింది. రెండో విడత లాక్ డౌన్ ప్రారంభమయ్యాక.. మొత్తం కేసులు 11,439 కాగా.. 1076 ఫ్రెష్ ఇన్ఫెక్షన్లు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 178 మంది కరోనా రోగులు మరణించారని, 2,687 కేసులు నమోదయ్యాయని, 1305 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తమిళనాడులో 1204, తెలంగాణాలో 624, ఏపీలో 483, […]

కరోనా విలయం.. ఇండియా.. 24 గంటల్లో.. పెరిగిన కేసులు 11,400
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 15, 2020 | 4:08 PM

Share

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. గత 24 గంటల్లో కొత్తగా 11,400 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 377 కి పెరిగింది. రెండో విడత లాక్ డౌన్ ప్రారంభమయ్యాక.. మొత్తం కేసులు 11,439 కాగా.. 1076 ఫ్రెష్ ఇన్ఫెక్షన్లు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 178 మంది కరోనా రోగులు మరణించారని, 2,687 కేసులు నమోదయ్యాయని, 1305 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తమిళనాడులో 1204, తెలంగాణాలో 624, ఏపీలో 483, రాజస్థాన్ లో 969, మధ్యప్రదేశ్ లో 730, గుజరాత్ లో 650 కేసులు నమోదయ్యాయి. ఇంకా వివిధ రాష్ట్రాల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్సాం..32

బీహార్ ..66

ఢిల్లీ..1561

హర్యానా ..199

కర్ణాటక..260

కేరళ..387

పంజాబ్..176

పశ్చిమ బెంగాల్..213

ఛత్తీస్ గడ్..33

ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు మరీ పెద్ద సంఖ్యలో లేవని తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మొత్తం దాదాపు 20 లక్షల వరకు చేరుకోగా.. లక్షా 26 వేల మంది మరణించారు. అమెరికాలో 6 లక్షల కేసులు నమోదు కాగా.. 26 వేల మంది మృత్యు బాట పట్టారు. స్పెయిన్ లో 1.74 లక్షలు, ఇటలీలో 1.62 లక్షలు, జర్మనీలో 1.32 లక్షలు, ఫ్రాన్స్ లో 1.31 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 21,067 మంది, స్పెయిన్ లో 18,255,ఫ్రాన్స్ లో 15,729 మంది రోగులు మృతి చెందారు.