మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మధ్య ప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఆ రాష్ట్ర యువతకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని మంగళవారం తెలియజేశారు. కోవిడ్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో..
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మధ్య ప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఆ రాష్ట్ర యువతకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని మంగళవారం తెలియజేశారు. కోవిడ్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర యువతను ఆదుకుని వారికి ఉద్యోగాలు కల్పించేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం అవసరమైన చట్టపరమైన చర్యలు చేపడతామని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. కాగా ఏపీ, హర్యానా సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నమెంట్ ఉద్యోగాలను ఆ రాష్ట్రానికి చెందిన స్థానికులకే ఇచ్చేందుకు బిల్లులను కూడా ప్రవేశ పెట్టాయి. ప్రైవేటు ఉద్యోగాలను కూడా రాష్ట్రంలోని వారికే కేటాయించాలని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నారు.
MP govt has taken an important decision today. We will be taking necessary legal steps so that government jobs in Madhya Pradesh are only given to the state’s youth: Chief Minister Shivraj Singh Chouhan pic.twitter.com/8fG9djcFo5
— ANI (@ANI) August 18, 2020
Read More:
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని హడలెత్తిస్తున్న కరోనా