AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా..కరోనా.. ఇప్పుడు చైనా చేస్తోందేమిటి ?

కరోనా వైరస్ ప్రబలడానికి కారణం చైనాయేనని అన్ని దేశాలూ వేలెత్తి చూపిస్తున్న వేళ.. ఆ దేశం మరో కొత్త 'ప్రయోగం' చేపడుతోంది. గబ్బిలాలు, పాంగోలిన్ల వ్యర్థాల నుంచి తయారు చేసే సాంప్రదాయక మెడిసిన్లకు..

కరోనా..కరోనా.. ఇప్పుడు చైనా చేస్తోందేమిటి ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 09, 2020 | 6:58 PM

Share

కరోనా వైరస్ ప్రబలడానికి కారణం చైనాయేనని అన్ని దేశాలూ వేలెత్తి చూపిస్తున్న వేళ.. ఆ దేశం మరో కొత్త ‘ప్రయోగం’ చేపడుతోంది. గబ్బిలాలు, పాంగోలిన్ల వ్యర్థాల నుంచి తయారు చేసే సాంప్రదాయక మెడిసిన్లకు, ఉత్పత్తులకు స్వస్తి చెబుతోంది. తమ మందుల కోసం వీటిని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నామన్న అప్రదిష్టను తొలగించుకోవడానికి ఈ సరికొత్త యోచనకు శ్రీకారం చుట్టింది. చైనా ప్రభుత్వం తమ ‘డ్రగ్ బైబిల్’ నుంచి ఈ మందులను తొలగిస్తున్నామని ప్రకటించుకుంటోంది. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి పుట్టిందని, పాంగోలిన్ల ద్వారా మానవులకు సంక్రమిస్తోందని నిపుణులు అనుమానిస్తుండగా.. ఆ దేశం మెల్లగా ఈ గైడ్ నుంచి వీటిని తొలగిస్తున్నట్టు పేర్కొంది. గబ్బిలాల వ్యర్థాల నుంచి తయారు చేసే మందులు వివిధ రకాల కంటి రోగాలను నయం చేస్తాయట.. అలాగే పాంగోలిన్ల చర్మ పొలుసుల నుంచి తయారు చేసే ‘జియా జూ ‘ అనే మెడిసిన్ బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుందని, కడుపులో మంట వంటి రుగ్మతలను నయం చేస్తుందని వారు నమ్ముతున్నారు. 16 వ శతాబ్దంలోనే చైనా మెడికల్ ఎన్ సైక్లోపీడియాలో ఈ మందుల గురించి వివరించారని చెబుతారు. తాజాగా పాంగోలిన్ల రవాణాను,  వాటి మాంసం తినడాన్ని తాత్కాలికంగా  నిషేధించినట్టు చైనా ప్రకటించింది. అంతరించిపోతున్న పాంగోలిన్లను ఇక పరిరక్షిస్తామని బీజింగ్ వెల్లడించింది. అయితే వూహాన్ మార్కెట్ లో మాత్రం వన్య మృగాల అవశేషాలు కనబడుతూనే ఉన్నాయి.

Follow Us