AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్వారంటైన్‌ రూల్స్ బ్రేక్ చేస్తే.. ఇక హత్యాయత్నం కేసు పెట్టడమే..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోంది. అన్ని దేశాలు కూడా ఈ కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నాయి. ఇక మన దేశంలో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది.

క్వారంటైన్‌ రూల్స్ బ్రేక్ చేస్తే.. ఇక హత్యాయత్నం కేసు పెట్టడమే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2020 | 11:07 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోంది. అన్ని దేశాలు కూడా ఈ కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నాయి. ఇక మన దేశంలో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మన దేశంలో కేసులు పెరగడానికి మొన్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారు, తబ్లీఘీ జమాత్ కారణమైతే.. ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయడం ద్వారా కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ నిబంధనలు, క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా.. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.ఈ మేరకు అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమాంత బిస్వాశర్మ శుక్రవారం ఓ ప్రకటన చేశారు. క్వారంటైన్ సెంటర్లలో ఏమైనా ఇబ్బందులుంటే సంబంధింత అధికారులకు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని.. అలా చేస్తే ఇబ్బందుల సమస్య తొలిగిపోతుందని.. అలా కాకుండా రూల్స్‌ బ్రేక్‌ చేసి వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల అక్కడికి వలస కూలీలు ఎక్కువగా వస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.