రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యల వల్ల వలస కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ముందస్తు ప్రణాళిక లేకుండానే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను విధించిందని తప్పుబట్టారు. అటు వలస కార్మికులను ఆదుకోవడంలో కూడా కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. శుక్రవారం శాస్ర్తిపురంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు మజ్లిస్‌ పార్టీ తరఫున కరోనా రక్షణ కిట్‌లను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికులకు రేషన్ […]

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

Updated on: Apr 25, 2020 | 10:31 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యల వల్ల వలస కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ముందస్తు ప్రణాళిక లేకుండానే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను విధించిందని తప్పుబట్టారు. అటు వలస కార్మికులను ఆదుకోవడంలో కూడా కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. శుక్రవారం శాస్ర్తిపురంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు మజ్లిస్‌ పార్టీ తరఫున కరోనా రక్షణ కిట్‌లను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వలస కార్మికులకు రేషన్ సరిగ్గా అందడం లేదని, కార్మికులు, ఉద్యోగులు పూర్తి వేతనాలు అందుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇక రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లింలందరూ కూడా ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలన్న ఓవైసీ .. సామాజిక దూరం పాటించాల్సిందే అన్నారు. మరోవైపు నిరుపేద ముస్లింలకు రంజాన్‌ మాసం పురస్కరించుకుని అన్నపూర్ణ క్యాంటిన్‌ల ద్వారా అన్నదానం చేయనున్నట్టు ఎంపీ అసద్‌ తెలిపారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత అన్నదానం పంపిణీ చేస్తామని.. గుంపులు గుంపులుగా కాకుండా… ఒక్కొక్కరు వచ్చి వాటిని తీసుకెళ్లాలని సూచించారు.

ఇవి చదవండి:

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

ముస్లిం ఇచ్చాడని వద్దన్నాడు.. జైలు పాలయ్యాడు..

చైనాకు కొత్త తలనొప్పి.. కోటి జనాభా ఉన్న సిటీ లాక్‌డౌన్‌..

వివాదాస్పదంగా మారిన మరో వైసీపీ ఎమ్మెల్యే ట్రాక్టర్ ర్యాలీ…