AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులకు శుభవార్త..ఈ నెల నుంచి ఫుల్ శాలరీ..బకాయిలపై..

లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతామే చెల్లించారు. గత రెండు నెలల బకాయిలపై త్వరలోనే

ఉద్యోగులకు శుభవార్త..ఈ నెల నుంచి ఫుల్ శాలరీ..బకాయిలపై..
Jyothi Gadda
|

Updated on: May 21, 2020 | 12:56 PM

Share

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా సగం జీతాలు మాత్రమే తీసుకుంటున్న ఎంప్లాయిస్ కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి ఊరట నిచ్చింది. జీతాలు, గత రెండు నెలల బకాయిలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు.

దేశంలో లాక్‌‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. ఈ కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ..ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే చెల్లించారు. గత రెండు నెలల బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అటు ఉద్యోగులకు జీతాలు కట్ చేయడంపై హైకోర్టులో ఒక ఉద్యోగి పిటిషన్ వేయగా… దీనిపై విచారణ జరగాల్సి ఉంది.