AP Corona Cases: ఏపీలో కొత్త‌గా 22,517 క‌రోనా పాజిటివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగా మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా తీవ్రత కొన‌సాగుతుంది. కొత్త‌గా 89,535 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 22,517 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

AP Corona Cases: ఏపీలో కొత్త‌గా 22,517 క‌రోనా పాజిటివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగా మ‌ర‌ణాలు
Ap Corona
Follow us

|

Updated on: May 15, 2021 | 7:15 PM

ఏపీలో క‌రోనా తీవ్రత కొన‌సాగుతుంది. కొత్త‌గా 89,535 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 22,517 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 14,11,320 మంది వైరస్‌ బారినపడ్డారు. కరోనా కార‌ణంగా కొత్త‌గా.. అనంతపురంలో 12 మంది చ‌నిపోగా, నెల్లూరులో 11, తూర్పుగోదావరి 10, విశాఖ 9, విజయనగరం 9, చిత్తూరు 8, శ్రీకాకుళం 8, గుంటూరు 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, కర్నూలు 5, ప్రకాశం 5, కడప ఇద్దరు ప్రాణాలు విడిచారు. తాజాగా 18,739 మంది వైర‌స్ బారి నుంచి కోలుకోగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 11,94,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో తూర్పుగోదావరిలో అత్య‌ధికంగా 3383 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 992 కేసులు వెలుగుచూశాయి. మొత్తం 1,78,80,755 శాంపిల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కాగా క‌రోనా కొత్త వేరియంట్లపై ఎన్నో అనుమానాలు నెల‌కుంటున్నాయి. వీటిని వ్యాక్సిన్లు ఏమేర ఎదుర్కొంటాయన్న దానిపై ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక సూచన చేశారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని సూచించారు. అలాగే భౌతిక దూరం సైతం పాటించాలన్నారు. వైరస్‌ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అలెర్ట్ గా ఉండాల‌న్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌ని చెప్పారు. అయితే, ఏ వేరియంట్‌ బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.

Also Read:  బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ఈఎన్‌టీ ఆస్పత్రి.. తెలంగాణ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

 క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను..

పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??
పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??
విజయ్ మాల్యా విషయంలో ఫ్రాన్స్ సాయం కోరిన భారత్
విజయ్ మాల్యా విషయంలో ఫ్రాన్స్ సాయం కోరిన భారత్
పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా ?? తింటె ఏమౌతుంది ??
పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా ?? తింటె ఏమౌతుంది ??
తులసితో తళతళలాడే అందం..! మొటిమలు, మచ్చలు మాయం చేసే అద్భుత మంత్రం
తులసితో తళతళలాడే అందం..! మొటిమలు, మచ్చలు మాయం చేసే అద్భుత మంత్రం
పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ భారతి.. ఏమన్నారంటే
పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ భారతి.. ఏమన్నారంటే
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్