AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచి సున్నా వడ్డీ పధకం.. వివరాలు ఇవే..

కరోనా కష్టకాలంలో పొడుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సున్నా వడ్డీ పధకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

నేటి నుంచి సున్నా వడ్డీ పధకం.. వివరాలు ఇవే..
Ravi Kiran
|

Updated on: Apr 24, 2020 | 8:07 AM

Share

ఒకవైపు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే.. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సామాన్యులకు అండగా నిలుస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం. కరోనా కష్టకాలంలో పొడుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సున్నా వడ్డీ పధకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇవాళ తాడేపల్లిగూడంలోని తన క్యాంప్ ఆఫీస్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి సున్నా వడ్డీ డబ్బులను జమ చేసే బటన్ నొక్కుతారు. దీని ద్వారా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్రంలోని 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లోకి రూ. 1,400 కోట్లు ఒకే విడత జమ అవుతాయి. కాగా, పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి జీరో వడ్డీ పధకం అమలుకు గానూ ప్రభుత్వం రూ.765.19 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇవి చదవండి:

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి పార్టీ చేసుకున్న గ్రామ వాలంటీర్లు..

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..