AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“అనకొండ రైలు”ను మీరు చూశారా…

భారతీయ రైల్వే సరికొత్త రికార్డుకు తెరలేపింది. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్‌ రైళ్లను జత చేసి ఒకే రైలుగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్‌పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌కు...

అనకొండ రైలును మీరు చూశారా...
Sanjay Kasula
|

Updated on: Jul 01, 2020 | 10:23 AM

Share

భారతీయ రైల్వే సరికొత్త రికార్డుకు తెరలేపింది. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్‌ రైళ్లను జత చేసి ఒకే రైలుగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్‌పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన మూడు గూడ్స్‌ రైళ్లను జతచేసి నడిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. దీనిపై రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లోడుతో ఉన్న మూడు రైళ్లను జతకలిపి బిలాస్‌పుర్‌-చక్రధర్‌పూర్‌ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపినట్లు వెల్లడించింది. 15 వేల టన్నులకు పైగా సరకుతో ఉన్న మూడు రైళ్లను నడిపించారు. గూడ్స్‌ రైలు సర్వీసుల రవాణా సమయాన్ని తగ్గించేందుకే ఈ వినూత్న ప్రయోగం చేపట్టినట్లు పేర్కొంది. దీన్ని అనకొండ రైలుగా పిలుస్తున్నారు.

కరోనా సంక్షోభ సమయంలో శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా వలసకూలీలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న రైల్వే.. ఆహార ధాన్యాలు, ఎరువులు, బొగ్గు, ఇతర నిత్యావసర సామగ్రిని తరలించడంపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. రైల్వేశాఖ దేశంలో ప్యాసింజర్ రైళ్ల కదలికను పరిమితం చేసినప్పటికీ గూడ్స్‌ రైలు సేవలు యథాతథంగా నడుస్తున్నారు.