పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..

Coronavirus Updates: ఢిల్లీలోని కరోనా బాధితురాలు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వారిద్దరిని కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి డాక్టర్లు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో పని చేసే రెసిడెంట్ డాక్టరుకు కరోనా పాజిటివ్ తేలగా.. ఆయన భార్యకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమె నిండు గర్భిణి.. ఇక శుక్రవారం రాత్రి ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. అనంతరం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం […]

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..
Follow us

|

Updated on: Apr 05, 2020 | 4:17 PM

Coronavirus Updates: ఢిల్లీలోని కరోనా బాధితురాలు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వారిద్దరిని కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి డాక్టర్లు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో పని చేసే రెసిడెంట్ డాక్టరుకు కరోనా పాజిటివ్ తేలగా.. ఆయన భార్యకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమె నిండు గర్భిణి.. ఇక శుక్రవారం రాత్రి ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. అనంతరం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించగా.. దేశంలో కరోనా పేషంట్ బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. అటు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు(601), మరణాలు(12) నమోదు కావడంతో.. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 77 మంది మృతి చెందారు.. కాగా, 3374 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇవి చదవండి:

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ..

దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్‌ ఇవే.. తస్మాత్ జాగ్రత్త..

వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం

మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..

వైసీపీ ఆగడాలపై గవర్నర్‌కు టీడీపీ నేతల లేఖ..

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?

దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..

ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..

కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..