AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 2 Postponed: తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్ష మళ్లీ వాయిదా.. కొత్త పరీక్ష తేదీలివే!

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షను టీఎస్పీయస్సీ మళ్లీ వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్- 2 (TSPSC Group 2) పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో.. ఈ నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా పరీక్షను వచ్చే ఏడాది (2024) జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు..

TSPSC Group 2 Postponed: తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్ష మళ్లీ వాయిదా.. కొత్త పరీక్ష తేదీలివే!
TSPSC Group 2 Postponed
Srilakshmi C
|

Updated on: Oct 10, 2023 | 9:52 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షను టీఎస్పీయస్సీ మళ్లీ వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్- 2 (TSPSC Group 2) పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో.. ఈ నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా పరీక్షను వచ్చే ఏడాది (2024) జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) మంగళవారం (అక్టోబర్‌ 10) ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన సమావేశంలో గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేయడంతోపాటు కొత్త తేదీలను కూడా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌ 2 పరీక్ష కోసం నిరుద్యోగులు పోటీపడి ప్రిపేరవుతున్నారు. ఈ క్రమంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కమిషన్‌ ప్రకటించడం చర్చణీయాంశంగా మారింది. గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఓసారి పరీక్ష తేదీని మార్చిన కమిషన్‌ ఇప్పుడు రెండోసారి పరీక్ష వాయిదా వేస్తూ ప్రకటన వెలువరించడం గమనార్హం. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అప్పుడు రాష్ట్రంలో వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పరీక్షలకు సన్నద్ధమవడానికి సరిపడా సమయం లేదని.. గ్రూప్‌ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు.

దీంతో గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం నవంబర్‌ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు కొత్త తేదీలను సైతం ప్రకటించింది. ఈ క్రమంలో ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో పరీక్షల నిర్వహణ కష్టమని భావించిన అధికారులు తాజా మరోమారు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 783 పోస్టులకు గ్రూప్‌ 2 నియమాక నోటిఫికేషన్‌ విడుదలవగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు
మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు
ఒంగోల్‌ గనులశాఖలో అవినీతి జలగలు.. ఏకకాలంలో ACB దాడులు
ఒంగోల్‌ గనులశాఖలో అవినీతి జలగలు.. ఏకకాలంలో ACB దాడులు
ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు
ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు
టీ20 ప్రపంచకప్ నుంచి హర్షిత్ రాణా.. సిరాజ్‌కి లక్కీ ఛాన్స్?
టీ20 ప్రపంచకప్ నుంచి హర్షిత్ రాణా.. సిరాజ్‌కి లక్కీ ఛాన్స్?
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? వారికి భారీ షాక్
ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? వారికి భారీ షాక్
రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు..
రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు..
కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116
కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116