AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disabled People Job Portal: ‘దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌.. ఇకపై నేరుగా ఉద్యోగాలు’ మంత్రి సీతక్క

మంత్రి సీతక్క దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్‌ ద్వారా దివ్యాంగ అభ్యర్ధులు దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది..

Disabled People Job Portal: 'దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌.. ఇకపై నేరుగా ఉద్యోగాలు' మంత్రి సీతక్క
Disabled People Job Portal
Srilakshmi C
|

Updated on: Oct 15, 2024 | 4:47 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15: తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్‌ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పది మందికి మహిళా సంక్షేమ శాఖలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. వికలాంగులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇతర అభ్యర్థులతో పోటీ పడాలంటే వారు మరింత పోరాడాల్సి ఉంటుందని అన్నారు. వైకల్యం మన చేతుల్లో లేదు. పోషకాహార లోపం వ్యక్తులను వికలాంగులను చేస్తుంది. అలాంటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రైవేటు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రైవేటు ఉద్యోగాల కోసం దివ్యాంగ అభ్యర్ధులు ఆయా సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకునేలా జాబ్‌పోర్టల్‌ను అందుబాటులో తెచ్చామన్నారు.

ప్రైవేట్ యాజమాన్యాలు కూడా వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆమె అన్నారు. ఇకపై దివ్యాంగులు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌లో నేరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ పోర్టల్‌ ద్వారా వారు తమ అర్హతలను బట్టి ఉద్యోగావకాశాలు పొందవచ్చు. సంక్షేమ నిధుల నుంచి వికలాంగులకు ఐదు శాతం నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, రేవంత్ రెసర్కార్ ఒక శాతం రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచిందన్నారు.

ఇందిరమ్మ గృహాల వంటి సంక్షేమ పథకాల్లో కూడా ప్రభుత్వం దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తుందని, ఈ ఏడాది బడ్జెట్‌లో వికలాంగులకు ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని సీతక్క తెలిపారు.పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వికలాంగుల స్వయం ఉపాధికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్‌ శైలజ, దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ముత్తినేని వీరయ్యతో కలిసి జాబ్‌పోర్టల్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.