
హైదరాబాద్, జులై 24: తెలంగాణ ఎంసెట్-2023 ఫేజ్ 2 కౌన్సెలింగ్ సోమవారం (జులై 24) నుంచి ప్రారంభమవుతుంది. తొలి విడత కౌన్సెలింగ్లో సీటు పొందిన విద్యార్ధులు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు తేదీ జులై 23తో ముగిసిన సంగతి తెలిసిందే. కాగా తొలి విడతలో మొత్తం 70,665 మంది సీట్లు పొందారు. వీరిలో సుమారు 53 వేల మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో దాదాపు 18 వేల మంది ఫీజే చెల్లించలేదు.
చాలా మంది విద్యార్ధులు అధాక వర్షాల కారణంగా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేకపోయామని, గడువు పొడిగించవల్సిందిగా అభ్యర్ధిస్తున్నారు. తొలి విడతలో సీట్లు పొంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు ఆ సీటు వదులుకుని రెండో విడత కౌన్సెలింగ్లో మెరుగైన కాలేజీ సీటు కోసం ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా జులై 24 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇక చివరి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న సంగతి తెలిసిందే.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.