
రైల్వే శాఖలోని ఆర్ఆర్బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6, 2025వ తేదీతో ముగుస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దరఖాస్తు గడువు పెంపొందిస్తూ కీలక ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 16, 2025వ తేదీ వరకు పొడిగించింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరో అవకాశం దొరికినట్లైంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఆర్బీ అభ్యర్ధులకు సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టులు మొత్తం 1036 వరకు భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 16, 2025వ తేదీ రాత్రి 11.59 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏతోపాటు టెట్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 01, 2025 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఈబీసీ, మైనారిటీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఫిబ్రవరి 17 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరనకు అనుమతిస్తారు. ఆన్లైన్ రాత పరీక్ష, టీచింగ్ స్కిల్ టెస్ట్, ట్రాన్స్లేషన్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.