AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education: ఈ యూనివర్సిటీలో చేరితే నెలనెలా రూ.24 వేలు మీదే.. విద్యార్థులకు బంపర్ ఆఫర్..

దేశాభివృద్ధికి ఉన్నత విద్య పునాది. ఈ రంగం బలంగా ఉంటేనే అన్ని విభాగాల్లో పురోగతి సాధ్యం. అయితే, అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్య తక్కువ. ఈ లోపాన్ని భర్తీ చేయాలనే సంకల్పంతో, అర్హులైన యువతను డిగ్రీ నుంచి ఉన్నత చదువుల వైపు నడిపించాలనే ఉద్దేశంతో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది..

Education: ఈ యూనివర్సిటీలో చేరితే నెలనెలా రూ.24 వేలు మీదే.. విద్యార్థులకు బంపర్ ఆఫర్..
Open University Students Opportunity
Bhavani
|

Updated on: Jul 08, 2025 | 6:44 PM

Share

అనేకమంది విద్యార్థులకు ఉన్నత చదువులంటే ఆసక్తి ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే విద్యను ఆపేస్తుంటారు. అలాంటి వారికి తోడ్పాటు అందించడం ఎంతో ముఖ్యం. ఈ ఆలోచనతోనే డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఒక అడుగు ముందుకు వేసింది. విద్యార్థులు తమ చదువు కొనసాగిస్తూనే ప్రతి నెలా సంపాదన పొందేలా ఒక ప్రతిష్టాత్మక సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ వివరాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) ఘంటా చక్రపాణి వెల్లడించారు.

విద్యార్థులకు చేయూత: నైపుణ్యంతో కూడిన విద్య

విద్యార్థుల్లో అకడమిక్ నాలెడ్జ్‌తో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడం, ఉపకారవేతనం ఆధారిత విద్యను అందించడమే తమ ప్రథమ లక్ష్యమని ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి వివరించారు. ఈ సోమవారం వర్సిటీ ఆవరణలో రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (రాస్కీ) సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ జెమ్స్ రాఫెల్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.

గరిష్ఠంగా నెలకు రూ.24,000 పైగా ఆదాయం

రాస్కీ సంస్థతో ఒప్పందం చేసుకున్న దేశంలోనే మొదటి వర్సిటీ తమదే అని ఆచార్య ఘంటా చక్రపాణి గర్వంగా తెలిపారు. ప్రతి విద్యార్థికి విద్యను పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం లభించడం లేదా సొంతంగా వ్యాపారవేత్తలుగా ఎదగడం తమ ధ్యేయం అని ఆయన అన్నారు.

ఈ ప్రత్యేక ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులు నెలకు కనీసం రూ.7,000 నుంచి గరిష్ఠంగా రూ.24,000 పైగా సంపాదించుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తమ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసుకున్న, 28 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు కూడా ఈ పథకానికి అర్హులు అని తెలిపారు. అతి త్వరలోనే విశ్వవిద్యాలయం వెబ్‌పోర్టల్‌లో ఈ కార్యక్రమం పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ఈ అరుదైన అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

“రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థతో మా ఒప్పందం కుదిరింది. చదువుతో పాటు ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించడం, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఈ ప్రోగ్రాంలో చేరడం ద్వారా నెలకు కనీసం రూ.7,000 నుంచి గరిష్ఠంగా రూ.24,000 పైగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది.” – ఆచార్య ఘంటా చక్రపాణి, డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి.

పరిశ్రమే ఉత్తమ గురువు

రాస్కీ ప్రతినిధి సమీర్ నర్సాపూర్ మాట్లాడుతూ, పరిశ్రమే ఉత్తమ గురువు అని, విద్యార్థులు వృత్తిపరమైన ప్రమాణాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాస్కీ (సౌత్ రీజియన్) జనరల్ మేనేజర్ చంద్ర వడ్డే, వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి, ఈఎంఆర్‌ఆర్‌సీ డైరెక్టర్ రవీంద్రనాథ్ సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.