AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Mega DSC 2025 Helpline: మెగా డీఎస్సీ హాల్ టికెట్లలో సందేహాలా? ఈ హెల్ప్‌ డెస్క్‌ నెంబర్లకు ఫోన్‌ చేయండి..

రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2025 హాల్‌ టికెట్లు గత శనివారం (మే 31) రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తులైతే అన్ని సబ్జెక్టులకు కలిపి 5,77,417 వరకు వచ్చాయి. కొందరు అభ్యర్ధులు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు..

AP Mega DSC 2025 Helpline: మెగా డీఎస్సీ హాల్ టికెట్లలో సందేహాలా? ఈ హెల్ప్‌ డెస్క్‌ నెంబర్లకు ఫోన్‌ చేయండి..
Mega DSC 2025 Helpline
Srilakshmi C
|

Updated on: Jun 02, 2025 | 6:52 PM

Share

అమరావతి, జూన్ 2: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2025 హాల్‌ టికెట్లు గత శనివారం (మే 31) రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తులైతే అన్ని సబ్జెక్టులకు కలిపి 5,77,417 వరకు వచ్చాయి. కొందరు అభ్యర్ధులు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడమే అందుకు కారణం. అయితే జూన్‌ 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలైనప్పటి నుంచి అభ్యర్ధులందరూ ఒకటే కంగారు పడుతున్నారు.

అందుకు కారణం ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల రాత పరీక్షలకు కేంద్రాలు వేర్వేరు జిల్లాల్లో కేటాయించడమే. ఈ పోస్టులకు ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేయడంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పరీక్ష కేంద్రాలు మాత్రం ఒక్కొక్కరికి వేర్వేరు జిల్లాల్లో, కొందరికి వేర్వేరు రాష్ట్రాల్లో కూడా కేటాయించారు. దీంతో అభ్యర్ధులు గందరగోళ పడుతున్నారు. అయితే డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణా రెడ్డి మాత్రం అభ్యర్ధులు పరీక్ష కేంద్రాల ఎంపికకు ఇచ్చిన తొలి ఎంపిక ప్రకారంగానే అందరికీ పరీక్ష కేంద్రాలు కేటాయించామని చెబుతున్నారు.

నిజానికి, ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అందరికీ పరీక్ష కేంద్రాలు వేర్వేరు జిల్లాల్లో పడ్డాయి. ఈ క్రమంలో హాల్ టికెట్లలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు డీఎస్సీ హెల్ప్ డెస్క్‌కు కాల్ చేయవచ్చని విద్యాశాఖ తెలిపింది. 6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286, 9963069286, 7013837359 నంబర్లకు ఫోన్ చేసి అభ్యర్ధులు తమ అభ్యంతరాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే dscgrievances@apschooledu.in ఐడీకి మెయిల్ చేసి కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని డీఎస్సీ కన్వీనర్ ఎం వెంకట కృష్ణారెడ్డి సూచించారు. కాగా జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.