AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Result Date: నేటితో ముగిసిన ‘పది’ పబ్లిక్‌ పరీక్షలు.. రేపట్నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2023 నేటితో ముగిశాయి. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం (ఏప్రిల్ 19) నుంచి ప్రారంభం కానుంది. దీంతో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఏప్రిల్ 19 నుంచి..

AP 10th Result Date: నేటితో ముగిసిన 'పది' పబ్లిక్‌ పరీక్షలు.. రేపట్నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం
AP 10th Class Exams
Srilakshmi C
|

Updated on: Apr 18, 2023 | 3:13 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2023 నేటితో ముగిశాయి. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం (ఏప్రిల్ 19) నుంచి ప్రారంభం కానుంది. దీంతో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమవుతుందని.. ఉత్తర్వులు అందుకున్న అందరూ విధులకు తప్పక హాజరు కావాలని డీఈవో పి శైలజ సోమవారం (ఏప్రిల్ 17) ఓ ప్రకటనలో తెలిపారు. ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. మూల్యాంకన విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ‘పది’ మూల్యాంకనం ఈ నెల19 నుంచి 26వ తేదీ వరకు జరగనుంది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఏర్పాటు చేసిన స్పాట్‌ వాల్యుయేషన్ కేంద్రాల్లో దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొననున్నారు. ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి దేవానందరెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి విధితమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.