AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge Plans Strategy: మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ 28 రోజులే ఎందుకు ఉంటాయి? బిజినెస్‌ మైండ్‌ అంటే ఇదే..

Recharge Plans Strategy: సాధారణంగా మొబైల్‌ రీఛార్జ్‌ చేసుకోవాలంటే 30 రోజుల వ్యాలిడిటీ కాకుండా 28 రోజులే ఉంటాయి. మరి నెల మొత్తం కాకుండా కేవలం 28 రోజులో ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా? దీన్ని బట్టి చూస్తే కంపెనీ బిజినెస్‌ మైండ్‌ ఎలాంటి ఉంటుందో అర్థమైపోతుంటుంది..

Recharge Plans Strategy: మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ 28 రోజులే ఎందుకు ఉంటాయి? బిజినెస్‌ మైండ్‌ అంటే ఇదే..
Subhash Goud
|

Updated on: Jun 21, 2025 | 6:29 PM

Share

28 Days Recharge Plan Strategy: భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రముఖ టెలికాం కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ రకాల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతున్నాయి. చాలా కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌లలో చాలా వరకు 28 రోజులకు సంబంధించినవి. కంపెనీలు నెల కూడా పూర్తి చేయకుండా 28 రోజుల ప్లాన్‌లను ప్రవేశపెట్టడం వెనుక ఒక పెద్ద వ్యాపార వ్యూహం ఉంది. ప్రారంభంలో కొన్ని కంపెనీలు మాత్రమే 28 రోజుల ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. వారు ప్రతి నెలా ప్లాన్‌లను ప్రవేశపెడితే, వినియోగదారులు సంవత్సరంలో 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. కానీ వాస్తవం ఏమిటంటే 28 రోజుల ప్లాన్‌లతో వినియోగదారులు సంవత్సరంలో 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: No Petrol: జూలై 1 నుంచి ఈ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌.. కొత్త టెక్నాలజీ!

28 రోజుల ప్లాన్‌లను ఉపయోగించడం ద్వారా మీరు 30 రోజుల నెలల్లో 2 రోజులు తక్కువ, 31 రోజుల నెలల్లో 3 రోజులు తక్కువ పొందుతారు. దీని వలన దాదాపు ఒక నెల అదనంగా వస్తుంది. అందుకే సంవత్సరానికి 12 రీఛార్జ్‌లకు బదులుగా, మీరు 13 రీఛార్జ్‌లు చేయాలి.

ఫిబ్రవరిలో 29 రోజులు ఉన్న సంవత్సరాల్లో ఆ విధంగా ఒక అదనపు రోజు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వ్యూహం ద్వారా టెలికాం కంపెనీలు ప్రతి సంవత్సరం ఒక అదనపు నెల రీఛార్జ్ ప్రయోజనాన్ని పొందుతాయి. అయితే ఇటీవల కోర్టు ఆదేశాలతో కొంత ఎక్కువ రీఛార్జ్ ప్లాన్‌తో 30 రోజుల పాటు వ్యాలిడిటీ కూడా అందిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేయనున్న కేంద్రం..!