AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TikTok: ఐదేళ్ల కిందట బ్యాన్‌ అయిన టిక్‌టాక్‌ భారత్‌లోకి మళ్లీ వస్తుందా?

TikTok: టిక్‌టాక్ వెబ్‌సైట్ ప్రస్తుతం చాలా మందికి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అందులోని లింక్‌లు ఓపెన్ కావడం లేదని చాలామంది చెబుతున్నారు. టిక్‌టాక్‌పై నిషేధం అధికారికంగా ఎత్తివేస్తుందా? లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఇది జరుగుతుందా అనేది స్పష్టత లేదు..

TikTok: ఐదేళ్ల కిందట బ్యాన్‌ అయిన టిక్‌టాక్‌ భారత్‌లోకి మళ్లీ వస్తుందా?
Subhash Goud
|

Updated on: Aug 23, 2025 | 8:46 AM

Share

భారతదేశంలో ఐదేళ్ల క్రితం నిషేధించిన టిక్‌టాక్ ఇప్పుడు తిరిగి వస్తున్నట్లు కనిపిస్తోంది. 2020 వరకు భారతదేశంలో నంబర్ వన్ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌గా ఉన్న చైనాకు చెందిన టిక్‌టాక్ వెబ్‌సైట్ ఇప్పుడు భారతదేశంలో చాలా చోట్ల తెరవడానికి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టిక్‌టాక్ యాప్ స్వయంగా అందుబాటులోకి రాలేదు. టిక్‌టాక్ వెబ్‌సైట్ మాత్రమే ఓపెన్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం లేదా టిక్‌టాక్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇది కూడా చదవండి: Washing Powder Nirma: ఒకప్పుడు దేశాన్ని ఏలిన ‘నిర్మా’ ఇప్పుడు ఏమైపోయింది..? ఒక తప్పు వల్ల కనుమరుగు

టిక్‌టాక్ అనేది చిన్న వీడియోలకు ప్రసిద్ది చెందింది. చైనీస్ కంపెనీ బైటెన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్, చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. 2020లో భారతదేశంలో 200 మిలియన్లకు పైగా ప్రజలు టిక్‌టాక్ క్రియాశీల వినియోగదారులుగా ఉన్నారు. అయితే 2020లో గల్వాన్ లోయలో చైనా సైనికులు, భారత సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత టిక్‌టాక్‌తో సహా అనేక చైనీస్ యాప్‌లను భారతదేశం నిషేధించింది. గత ఐదు సంవత్సరాలలో టిక్‌టాక్ స్థానంలో ఇన్‌స్టా, షార్ట్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా?

టిక్‌టాక్ తిరిగి వస్తుందా?

టిక్‌టాక్ వెబ్‌సైట్ ప్రస్తుతం చాలా మందికి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అందులోని లింక్‌లు ఓపెన్ కావడం లేదని చాలామంది చెబుతున్నారు. టిక్‌టాక్‌పై నిషేధం అధికారికంగా ఎత్తివేస్తుందా? లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఇది జరుగుతుందా అనేది స్పష్టత లేదు. అయితే అమెరికా భారతదేశంపై 50% సుంకం విధించిన తర్వాత, భారతదేశం – చైనా మధ్య సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారాయి. విదేశాంగ మంత్రి చైనాకు వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 31న చైనాను సందర్శించనున్నారు.

అరుదైన భూమి ఖనిజాలపై చైనా తన ఆంక్షలను కూడా ఎత్తివేసింది. ఈ పరిణామాలన్నీ భారతదేశం – చైనా సాధారణ సంబంధాన్ని ప్రారంభించాయని సూచిస్తున్నాయి. చైనా యాప్‌లపై భారతదేశం తన నిషేధాన్ని ఎత్తివేసినా ఆశ్చర్యం లేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Indian Railway: మీరు రైలు ఎక్కబోతున్నారా? ముందు ఈ కొత్త రూల్స్‌ తెలుసుకోండి!

ప్రభుత్వం ఏం చెబుతోంది?

భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ను అన్‌బ్లాక్ చేస్తూ ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అలాంటి ఏదైనా ప్రకటనలు పూర్తిగా తప్పు అని కేంద్రం తెలిపింది. ఇలాంటి వార్తలు ప్పుదారి పట్టివని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయవచ్చని చాలా మంది వినియోగదారులు నివేదించిన తర్వాత ఈ స్పష్టత వచ్చింది. అయితే, వారు చైనా ఆధారిత ప్లాట్‌ఫామ్‌లో వీడియోలను చూడటానికి లాగిన్ అవ్వలేకపోయారు. వీడియో-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యాప్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి