Top Brands: టాప్ లేపిన టాటా గ్రూప్.. అత్యంత విలువైన బ్రాండ్లలో అగ్రస్థానం..
అత్యంత విలువైన బ్రాండ్ ఏది అడిగితే చెప్పడం కష్టమే. అయితే దీనిపైనే బ్రాండ్ ఫైనాన్స్ అనే బ్రాండ్ వ్యాల్యూయేషన్, స్ట్రాటజీ కన్సల్టెన్సీ సంస్థ ఓ రిపోర్టును ప్రచురించింది. ఇండియా 100 2024 పేరిట ఆ నివేదికను వెల్లడించింది. తన లెక్కల ప్రకారం మన దేశంలో అత్యంత విలువైన బ్రాండ్ టాటా అని తేల్చింది. టాటా గ్రూప్ బ్రాండ్ వాల్యూ 28.6 బిలియన్ డాలర్లుగా పేర్కొంది.

వినియోగదారులు బ్రాండ్ పేరుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కొనే వస్తువు ఏదైనా బ్రాండెడేనా కాదా అనే విషయాన్ని తప్పనిసరిగా చూస్తారు. అయితే మన దేశంలో ఏది టాప్ బ్రాండ్ అంటే అది కొనే వస్తువును బట్టి మారుతుంటుంది. కాని దేశంలో అందుబాటులో ఉన్న వస్తువుల్లోని బ్రాండ్లతో పోల్చి.. అత్యంత విలువైన బ్రాండ్ ఏది అడిగితే చెప్పడం కష్టమే. అయితే దీనిపైనే బ్రాండ్ ఫైనాన్స్ అనే బ్రాండ్ వ్యాల్యూయేషన్, స్ట్రాటజీ కన్సల్టెన్సీ సంస్థ ఓ రిపోర్టును ప్రచురించింది. ఇండియా 100 2024 పేరిట ఆ నివేదికను వెల్లడించింది. తన లెక్కల ప్రకారం మన దేశంలో అత్యంత విలువైన బ్రాండ్ టాటా అని తేల్చింది. టాటా గ్రూప్ బ్రాండ్ వాల్యూ 28.6 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. డిజిటలైజేషన్, ఈ-కామర్స్ ఈవీ, ఎలక్ట్రానిక్స్ పై దృష్టి సారిస్తూ దాదాపు 9శాతం తన విలువను పెంచుకున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ఈ బ్రాండ్ నివేదికలోని ప్రధాన అంశాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..
- టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 30 బిలియన్ డాలర్లు చేరింది. మొదటిసారిగా ఒక భారతీయ బ్రాండ్ ఈ మార్కును చేరుకుందని వివరించింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవకాశాలను ప్రతిబింబిస్తుందని చెప్పింది.
- గత మూడు సంవత్సరాలలో, టాటా గ్రూప్ దాని మానిఫోల్డ్ ఎంటర్ప్రైజెస్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అత్యాధునిక సాంకేతికతను తీసుకొచ్చింది. కఠినమైన సంస్థాగత శుద్ధీకరణను ఆర్కెస్ట్రేట్ చేసిందని బ్రాండ్ ఫైనాన్స్ పేర్కొంది.
- టాటా గ్రూప్ ఏకకాలంలో అనేక కొత్త వ్యూహాలను అమలు చేసిందని బ్రాండ్ ఫైనాన్స్ చెప్పుకొచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్లు, ఏరోనాటికల్ రీబ్రాండింగ్ ప్రయత్నాలు, వెస్ట్సైడ్, టాటా కన్స్యూమర్ ఉత్పత్తుల అభివృద్ధి తదితర రిటైల్ డొమైన్ల ద్వారా విస్తృతమైన పెట్టుబడుల కారణంగా దాని బ్రాండ్ ప్రాముఖ్యత మెటియోరికల్గా పెరిగిందని వివరించింది.
ఇన్ఫోసిస్ రెండో స్థానంలో..
- బ్రాండ్ ఫైనాన్స్ లిస్టింగ్లో అత్యంత విలువైన బ్రాండ్లలో టాటా తర్వాత స్థానాన్ని ఇన్ఫోసిస్ సొంతం చేసుకుంది. 14.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో నిలిచింది.
- ఈ ర్యాంకింగ్లో మూడవ స్థానంలో హెచ్డీఎఫ్సీ గ్రూప్ ఉంది. దీని బ్రాండ్ విలువ 10.4 బిలియన్ డాలర్లుగా అంచనా.
- ఎల్ఐసీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, లార్సెన్ అండ్ టూబ్రో, మహీంద్రా వంటి వ్యాపార సమూహాలు ఆ తర్వాత అత్యంత విలువైన భారతీయ బ్రాండ్ల జాబితాలో ఉన్నాయి.
- హెచ్సీఎల్ టెక్ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇది కూడా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, సేవలపై దృష్టి సారిస్తుంది.
- లార్సెన్, టూబ్రో బ్రాండ్ నిర్వహించే రంగాలలో సమర్థత, కార్యాచరణ శ్రేష్టతపై దాని పదునైన దృష్టి కారణంగా తొమ్మిదో స్థానాన్ని పొందింది.
దూసుకెళ్తున్న భారత్..
అభివృద్ధి, స్వావలంబన, స్వయంప్రతిపత్తి విధానాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ద్వారా భారతదేశం గ్లోబల్ సౌత్ లో విభిన్న నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకుంటుందని బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిమోన్ ఫ్రాన్సిస్ అన్నారు. భారతదేశం నేడు ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో ఒక కీలకమైన శక్తిగా ఉందన్నారు. బ్రాండ్ భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు ఫ్లాగ్ బేరర్గా ఉండటానికి భారతదేశం ప్రయత్నిస్తోందని ఫ్రాన్సిస్ చెప్పారు. గత సంవత్సరం నుంచి భారతదేశం తయారీ, ఇంజినీరింగ్ సేవలు, ఆర్ అండ్ డీ లలో నాలెడ్జ్ హబ్ కొనసాగుతోంది. టెలికాం రంగం బ్రాండ్ విలువలో 61 శాతం వృద్ధిని సాధించిందని. ఆ తర్వాత బ్యాంకింగ్ (26 శాతం), మైనింగ్, ఇనుము, ఉక్కు రంగాలు (ఒక్కొక్కటి కూడా దాదాపు 16 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుంది) అని రంగాల విశ్లేషణ వివరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




