AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 10 వేలు ఏకంగా రూ. 300 కోట్లు.! ఓ సామాన్య వ్యక్తి.. కోట్లకు అధిపతిగా మారాడు.. లాటరీ, జూదం కాదు

కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ ప్రకారం, 1985లో బ్యాంక్‌లో రూ.10,000 పెట్టుబడి పెట్టిన వారికి నేడు రూ.300 కోట్లు లభించి ఉండేవి. అయితే, ఇలాంటి పెట్టుబడులు అధిక రిస్క్‌తో కూడుకున్నవి. భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టే ముందు సరైన అవగాహన, నేర్చుకోవడం చాలా అవసరం అని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

రూ. 10 వేలు ఏకంగా రూ. 300 కోట్లు.! ఓ సామాన్య వ్యక్తి.. కోట్లకు అధిపతిగా మారాడు.. లాటరీ, జూదం కాదు
Money
Ravi Kiran
|

Updated on: Feb 25, 2026 | 9:02 AM

Share

స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఎప్పుడూ కూడా రిస్క్‌తో కూడుకున్నవి. ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలి.. ఆ సంస్థ మంచిదేనా.. లేక తన డబ్బుకు రిస్క్ ఉంటుందా.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అయితే మంచి కంపెనీలలో డబ్బు పెడితే మీ మొత్తానికి అధిక రాబడి వస్తుందని సీనియర్ బిజినెస్ ఇన్వెస్టర్లు తమ ప్రయాణాన్ని పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కోవకు చెందినది ఇది. వివరాల్లోకి వెళ్తే..! దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. దీని సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఇటీవల ఆ బ్యాంక్ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్ స్వయంగా పలు కీలక విషయాలు చెప్పారు.

1985లోని ప్రారంభమైన ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ అప్పటి మూలదానం రూ. 30 లక్షలు.. ఆ పెట్టుబడిలో ఎవరైనా రూ. 10 వేలు లేదా రూ. లక్ష పెట్టినట్లయితే.. ఇప్పుడు ఆ డబ్బు మీకు అధిక రాబడిని అందిస్తుంది. కేవలం రూ. 10 వేలు పెట్టుబడిగా పెట్టిన ఓ పెట్టుబడిదారుడికి ఆ డబ్బు ఇప్పుడు రూ. 300 కోట్లుగా మారేది. అలాగే క్యాపిటల్‌లోని ఆ రూ. 1 లక్ష వాటా ఇప్పుడు దశాబ్దాలుగా పెరిగి రూ. 1100 కోట్లు చేరి ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడులు, సరైన సంస్థను ఎంచుకోవడం వల్ల కలిగే అసాధారణ వృద్ధికి ఒక గొప్ప నిదర్శనం అని బిజినెస్ నిపుణులు అంటున్నారు. అయితే ఈ స్థాయి రాబడులు ఉన్న పెట్టుబడులలో అధిక రిస్క్ కూడా ఉంటుందని గుర్తించుకోవాలన్నారు. అందువల్ల, పెట్టుబడులు పెట్టడానికి ముందు, సంబంధిత అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, స్వయంగా నేర్చుకోవాలని, ఓర్పు కూడా ఉండాలని ఉదయ్ కోటక్ సూచిస్తున్నారు.

Follow Us