AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: గృహిణి ఆదా చేసిన మొత్తాన్ని ఆదాయంగా పరిగణించడం సరికాదు..ఐటీఏటీ తీర్పు

Income Tax: ఆదాయపు పన్నుకు సంబంధించి గృహిణులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. డీమోనిటైజేషన్ తర్వాత గృహిణులు జమ చేసుకున్న మొత్తం ఆదాయపు పన్ను దర్యాప్తు పరిధిలోకి రాదని తెలిపింది.

Income Tax: గృహిణి ఆదా చేసిన మొత్తాన్ని ఆదాయంగా పరిగణించడం సరికాదు..ఐటీఏటీ తీర్పు
KVD Varma
|

Updated on: Jun 24, 2021 | 6:42 PM

Share

Income Tax: ఆదాయపు పన్నుకు సంబంధించి గృహిణులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. డీమోనిటైజేషన్ తర్వాత గృహిణులు జమ చేసుకున్న మొత్తం ఆదాయపు పన్ను దర్యాప్తు పరిధిలోకి రాదని తెలిపింది. అయితే, ఈ మొత్తం సొమ్ము 2.5 లక్షలు మించకూడదు. అటువంటి డిపాజిట్లను ఆదాయంగా పరిగణించలేమని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) అభిప్రాయపడింది. గ్వాలియర్ కు చెందిన గృహిణి ఉమా అగర్వాల్ 2016-17 సంవత్సరానికి తన ఆదాయంలో మొత్తం రూ .1,30,810 ప్రకటించింది. డీమోనిటైజేషన్ తర్వాత ఆమె తన బ్యాంకు ఖాతాలో రూ .2.11 లక్షల నగదును జమ చేసింది. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను శాఖ ఇన్ కం టాక్స్ డిమాండ్ చేసింది. దీనితో విబేధించిన ఆ మహిళ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను సంప్రదించారు. ఈ మొత్తాన్ని తన భర్త, కొడుకు, బంధువులు కుటుంబానికి ఇచ్చిన మొత్తంలో పొదుపు రూపంలో జమ చేసినట్లు అగర్వాల్ తెలిపారు. సిఐటి (అప్పీల్స్) ఈ వివరణను అంగీకరించలేదు అంతేకాకుండా 2.11లక్షల రూపాయల నగదు డిపాజిట్‌ను వివరించలేని డబ్బుగా పరిగణించే అసెస్సింగ్ ఆఫీసర్ ఆదేశాన్ని ధృవీకరించింది. దీని తరువాత అగర్వాల్ ఈ విషయాన్ని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) కి తీసుకువెళ్ళారు.

ఆగ్రాలోని ఐటీఏటీలో జ్యుడిషియల్ సభ్యుడు లలిత్ కుమార్, అకౌంట్స్ సభ్యుడు డాక్టర్ మితా లాల్ మీనా మాట్లాడుతూ, ”డీమోనిటైజేషన్ సమయంలో ఆ మహిళ జమ చేసిన రూ .2,11,500 మొత్తం రూ .2.5 లక్షల పరిమితిలో ఉందని చెప్పారు. అందువల్ల దీనిని యాక్సెస్ ఆదాయంగా పరిగణించలేము. దీని అర్థం అది ఆమె సంపాదించింది కాదు. అందువల్ల దానిపై ఎటువంటి పన్ను ఉండదు.” అన్నారు. ట్రిబ్యునల్ తన ఉత్తర్వులో తన భర్త, పిల్లలు, బంధువుల నుండి అందుకున్న చిన్న మొత్తాలను జోడించి ఈ మొత్తాన్ని ఆదా చేసినట్లు అగర్వాల్ తెలిపారు. దాని పూర్తి వివరాలను కూడా ఇచ్చారు. దీన్ని అంగీకరించడంలో ఎటువంటి హాని లేదు. అందువల్ల, దానిపై పన్ను వసూలు చేయడానికి ఏ పన్ను అధికారం సరిపోదు.

రూ .2.5 లక్షల వరకు డిపాజిట్లపై మినహాయింపు..

డీమోనిటైజేషన్ సమయంలో 2.50 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసిన మహిళలకు మినహాయింపు ఇస్తారు. ఐటీఏటీ జ్యుడిషియల్ సభ్యుడు మాట్లాడుతూ, ”డీమోనిటైజేషన్ 2016 సమయంలో గృహిణులు ఈ ఆదా నిర్ణయం తీసుకున్నారని మేము ఈ కేసు ద్వారా స్పష్టం చేసాము. రూ .2.5 లక్షల రూపాయల ఆదా చేసిన సొమ్ముకు సంబంధించి తీసుకోవలసిన చర్యకు సంబంధించి ఈ తీర్పును ఒక ఉదాహరణను పరిగణించవచ్చు.” అన్నారు.

Also Read: Lava Wireless Earbuds: ఇయర్ బడ్స్ ను లాంఛ్ చేసిన లావా .. ఒక రూపాయి మాత్రమే.. స్టాక్ ఉన్నంత వరకే ప్రత్యేక ఆఫర్

Work From Home: ఇక‌పై వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే వారికి జీతాల్లో మార్పు.. ఇందుకు స‌రికొత్త టూల్‌ను రూపొందించిన గూగుల్‌