AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ రైలు కోసం తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు!

Indian Railways: శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కోసం తత్కాల్ టిక్కెట్లు ప్రయాణికులు OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) ప్రామాణీకరణను పూర్తి చేసిన తర్వాతే జారీ కానున్నాయని అధికారిక ప్రకటన తెలిపింది. ఓటీపీ విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాతే టిక్కెట్లు జారీ అవుతాయ అధికారి తెలిపారు..

Indian Railways: ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ రైలు కోసం తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు!
Subhash Goud
|

Updated on: Nov 29, 2025 | 12:28 PM

Share

Indian Railways: సాధారణంగా ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రైల్వే పలు నియమ నిబంధనలలో మార్పులు తీసుకువస్తుంటుంది. అలాగే పశ్చిమ రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌లో మార్పులు చేసింది. అహ్మదాబాద్, గుజరాత్, ముంబై సెంట్రల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు కోసం రైల్వేలు ఈ మార్పు చేశాయి. పశ్చిమ రైల్వే ప్రయాణీకుల కోసం OTP ధృవీకరణను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వ్యవస్థ డిసెంబర్ 1, 2025 నుండి అమలు చేయనుంది. అధికారిక ప్రకటన ప్రకారం.. ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కోసం తత్కాల్ టిక్కెట్లు ప్రయాణికులు OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) ప్రామాణీకరణను పూర్తి చేసిన తర్వాత మాత్రమే జారీ చేయనున్నారు. టిక్కెట్లను మరింత పారదర్శకంగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చడానికి రైళ్ల కోసం తత్కాల్ బుకింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్పు చేస్తున్నట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది.

చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌ను మాత్రమే నమోదు చేయండి:

డిసెంబర్ 1, 2025 నుండి ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కోసం తత్కాల్ టిక్కెట్లు ప్రయాణికులు OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) ప్రామాణీకరణను పూర్తి చేసిన తర్వాతే జారీ కానున్నాయని అధికారిక ప్రకటన తెలిపింది. ఓటీపీ విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాతే టిక్కెట్లు జారీ అవుతాయ అధికారి తెలిపారు. కొత్త వ్యవస్థ కింది పద్ధతుల ద్వారా చేసిన తత్కాల్ బుకింగ్‌లకు వర్తిస్తుంది. అవి కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు, IRCTC వెబ్‌సైట్, IRCTC మొబైల్ యాప్. దుర్వినియోగాన్ని నిరోధించడం, పారదర్శకతను ప్రోత్సహించడం, నిజమైన ప్రయాణికులకు తత్కాల్ టిక్కెట్లు పొందడానికి మంచి అవకాశం ఉందని నిర్ధారించడం ఈ చర్య లక్ష్యం. అయితే బుకింగ్‌ సమయంలో చెల్లుబాటు అయ్యే మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయడం తప్పనిసరి. దానికి వచ్చిన ఓటీపీ ఆధారంగా టికెట్‌ కన్ఫర్మ్‌ చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: LPG Gas: మీ ఇంట్లో ఎల్‌పీజీ కనెక్షన్ ఉందా? ఎవ్వరు చెప్పని సీక్రెట్‌ గురించి తెలుసుకోండి.. ఎంతో బెనిఫిట్‌!

ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ టైమ్ టేబుల్

ముంబై సెంట్రల్ – అహ్మదాబాద్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ చాలా ప్రజాదరణ పొందిన రైలు. రైలు నంబర్ 12009/12010 వారపు రోజులలో నడుస్తుంది. ఆదివారాల్లో నడవదు. ఇది ముంబై సెంట్రల్ నుండి ఉదయం 6:20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు 491 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఇది బోరివాలి, వాపి, సూరత్, భారుచ్, వడోదర, ఆనంద్, నదియాద్, అహ్మదాబాద్ స్టేషన్లలో దాని ప్రయాణంలో ఆగుతుంది. ఇది అహ్మదాబాద్ నుండి మధ్యాహ్నం 3:10 గంటలకు బయలుదేరి ఉదయం 9:45 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. దాని అద్భుతమైన సమయం కారణంగా ఇది అధిక ఆక్యుపెన్సీ రేటును కలిగి ఉంటుంది. టిక్కెట్ల కోసం వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Vande Bharat Sleeper: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. ఏ మార్గంలో అంటే..

Ayushman Card: మొబైల్ నంబర్ ఉపయోగించి మీ PMJAY కార్డ్ డౌన్‌లోడ్‌ చేయడం ఎలా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి