Tata Motors- Ford: ఫోర్డ్ కంపెనీని మరోసారి ఆదుకుంటున్న టాటా మోటార్స్.. రేపు ఫైనల్ కానున్న డీల్..!

Tata Motors- Ford: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ మరో సారి ఫోర్డ్ మోటార్స్ ను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో భారీ డీల్ రేపు జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Tata Motors- Ford: ఫోర్డ్ కంపెనీని మరోసారి ఆదుకుంటున్న టాటా మోటార్స్.. రేపు ఫైనల్ కానున్న డీల్..!
Tata Motors
Follow us

|

Updated on: May 29, 2022 | 4:04 PM

Tata Motors- Ford: ఫోర్డ్ ఇండియా ప్యాసింజర్ కార్ల తయారీ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు మార్గం సుగమమైంది. ఈ ప్లాంట్ గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్ వద్ద ఉంది. ఈ వారం ప్రారంభంలో.. ఈ ఒప్పందాన్ని కొనసాగించడానికి రెండు కంపెనీలు సమర్పించిన ప్రతిపాదనను గుజరాత్ మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారులు ధృవీకరించారు. ప్రభుత్వ అనుమతితో.. టాటా మోటార్స్ ప్లాంట్ ప్రారంభించిన సమయంలో ఫోర్డ్‌కు ఇచ్చిన ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను ఇప్పుడు పొందనుంది. కంపెనీల ప్రతిపాదనపై కేబినెట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ ఈ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయబోతోందని ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తోంది.

టాటా మోటార్స్, ఫోర్డ్ మోటార్ కంపెనీ రేపు (సోమవారం) ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో ఎంఓయూపై సంతకం చేయనున్నట్లు సమాచారం. ఫోర్డ్ మోటార్ కంపెనీ గత ఏడాది చివరిలో భారత్ లో తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి.. సనంద్‌లో ఉన్న దాని ప్యాసింజర్ కార్ల తయారీ ప్లాంట్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో తయారీని పూర్తిగా నిలిపివేసింది. దీనికి తోడు మరిన్ని అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.

గుజరాత్ కేబినెట్ నుంచి వచ్చిన ఆమోదం కేవలం గ్రీన్ సిగ్నల్ మాత్రమే. డీల్ పరిమాణం, లేబర్ ఇష్యూ, ఫైనాన్షియల్స్, బెనిఫిట్స్, డ్యూటీలకు సంబంధించిన విషయాలపై కంపెనీలు ఇంకా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు సంస్థలు అంగీకరించిన తర్వాత.. దీనిపై ఖచ్చితమైన ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ప్రధాన ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి 2018లో గుజరాత్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పవర్డ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రెండు ఆటోమొబైల్ దిగ్గజాలు టాటా మోటార్స్ ద్వారా ఫోర్డ్ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు సదరు కమిటీకి ప్రతిపాదనను సమర్పించాయి.

మే 30న ఎంవోయూ సంతకం కోసం అధికారిక మీటింగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. మిగిలిన రాయితీ కాలానికి గుజరాత్ ప్రభుత్వం టాటా మోటార్స్‌ను ఫోర్డ్‌కు ఇస్తుంది. అవుట్‌గోయింగ్ అన్ని ప్రయోజనాలను బదిలీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫోర్డ్ ప్రస్తుత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తాజా పెట్టుబడులు పెట్టిన తర్వాత కొత్త ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని టాటా మోటార్స్ యోచిస్తోందని వర్గాలు తెలిపాయి. ఈ డీల్ కారణంగా సోమవారం కంపెనీ షేర్లు పాజిటివ్ గా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.