SBI: ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని విత్‌డ్రా చేసుకోండి.. ఎస్‌బీఐ ప్రత్యేక సదుపాయం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారుల కోసం కొత్త కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మీ చుట్టు పక్కల ఏటీఎంలు లేక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అలాగే మీ మొబైల్‌లో యూపీఐ పని చేయకపోతే..

SBI: ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని విత్‌డ్రా చేసుకోండి.. ఎస్‌బీఐ ప్రత్యేక సదుపాయం
Cash
Follow us

|

Updated on: Jan 18, 2023 | 2:44 PM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారుల కోసం కొత్త కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మీ చుట్టు పక్కల ఏటీఎంలు లేక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అలాగే మీ మొబైల్‌లో యూపీఐ పని చేయకపోతే చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చుని డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏంటి ఇంట్లో కూర్చుని ఎలా విత్‌డ్రా చేస్తారని అనుకుంటున్నారా..? ఇందు కోసం ఎస్‌బీఐ తన వినియోగదారుల కోసం ఎస్‌బీఐ డోర్‌స్టెప్‌ సర్వీసును తీసుకువచ్చింది. మీ సమీపంలో ఏటీఎంలు లేక ఇబ్బందులు పడకుండా ఇంట్లో కూర్చుని డోర్‌స్టెప్‌ సర్వీసు ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. దీని కోసం కొంత ప్రాసెస్‌ ఉంటుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ డోర్‌స్టెప్ సర్వీస్ సహాయంతో మీరు ఇంట్లో కూర్చొని డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం మీరు బ్యాంకు, ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సేవ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించడం కోసం కస్టమర్‌లపై కొన్ని ఛార్జీలు విధిస్తోంది బ్యాంకు. మరి ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.

ఈ వ్యక్తులకు నెలలో మూడు లావాదేవీలు ఉచితం:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్‌లకు డోర్‌స్టెప్ సేవను ఉపయోగించుకునే సదుపాయాన్ని అందిస్తుంది. బ్యాంకు వికలాంగులకు నెలలో మూడు లావాదేవీలను ఉచితంగా చేసింది. అయితే, ఈ సదుపాయాన్ని నెలలో మూడుసార్లకు మించి ఉపయోగించినట్లయితే వారు ఆర్థిక, ఆర్థికేతర సేవలకు రూ.75, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ డోర్‌స్టెప్ సర్వీస్ రిజిస్ట్రేషన్

డబ్బును ఉపసంహరించుకోవడానికి, ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి మీరు ముందుగా ఎస్‌బీఐ డోర్‌స్టెప్ సేవ కోసం నమోదు చేసుకోవాలి. ముందుగా మీరు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్‌లో వచ్చిన ఓటీపీని నమోదు చేయండి. దీని తర్వాత కస్టమర్ తన పేరు, ఇమెయిల్, పాస్‌వర్డ్ (పిన్) ఎంటర్ చేసి, టర్మ్-షరతును అంగీకరించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత, డీఎస్‌బీ యాప్ నుండి ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఇప్పుడు కస్టమర్ పిన్, ఇతర వివరాలతో యాప్‌కి లాగిన్ చేయవచ్చు. ఇక్కడ మీరు మీ చిరునామాను కూడా నమోదు చేయండి.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ నుండి డబ్బును ఎలా ఉపసంహరించుకోవాలి

  • డీఎస్‌బీ యాప్‌కి లాగిన్ అయిన తర్వాత డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ఎస్‌బీఐని ఎంచుకోండి
  • ఇప్పుడు కస్టమర్ ఖాతా నంబర్‌లోని చివరి ఆరు అంకెలను నమోదు చేసి సమర్పించండి.
  • ధ్రువీకరణ తర్వాత కస్టమర్ల మొబైల్‌కు ఓటీపీ పంపబడుతుంది.
  • దీని తర్వాత డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ మొబైల్ యాప్‌లో ఓటీపీని నమోదు చేసి సమర్పించండి. నిర్ధారణ తర్వాత మీ వివరాలు కనిపిస్తాయి.
  • ఇప్పుడు కస్టమర్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా సర్వీసును ఎంచుకుని, లావాదేవీ మొత్తాన్ని నమోదు చేసి, లావాదేవీ మోడ్‌ను నమోదు చేయండి.
  • దీని తర్వాత కస్టమర్ ఖాతా నుండి ఛార్జీ కట్‌ అవుతుంది. అప్పుడు అభ్యర్థన సంఖ్యను నమోదు చేయండి.
  • ఎస్‌ఎంఎస్‌ ద్వారా కస్టమర్‌కు నోటిఫికేషన్ అందుకుతారు.
  • కస్టమర్ ఇంటికి చేరుకున్న తర్వాత ధృవీకరించిన తర్వాత ఏజెంట్ వచ్చి డబ్బును ఇస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి