Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Savings: సమయం దగ్గర పడుతోంది మిత్రమా..! సెప్టెంబర్‌ 30 సమీపిస్తోంది!

చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఆధార్, పాన్ నంబర్ ఇవ్వకపోతే పెట్టుబడి ఆగిపోతుంది. అంటే ఈ పథకాలలో పెట్టుబడి పెట్టిన మీ డబ్బు స్తంభింపజేయబడుతుంది. మీరు దానిని ఉపసంహరించుకోలేరు. వడ్డీ డబ్బులు కూడా జమ చేయడం లేదు. మీరు స్కీమ్‌లో డబ్బును డిపాజిట్ చేయడానికి కూడా పరిమితం చేయబడ్డారు. చిన్న పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే. ఇంతకు ముందు పథకాలను..

Small Savings: సమయం దగ్గర పడుతోంది మిత్రమా..! సెప్టెంబర్‌ 30 సమీపిస్తోంది!
Aadhaar
Follow us
Subhash Goud

|

Updated on: Sep 21, 2023 | 4:43 AM

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎన్‌సిఎస్‌ఎస్) వంటి చిన్న పొదుపు పథకాలను కలిగి ఉన్నవారి కోసం ఈ వార్త.. మీరు ఏవైనా పొదుపు ప్లాన్‌లు చేసి ఉంటే, వీలైనంత త్వరగా మీ ఆధార్,పాన్ నంబర్‌ను వాటికి లింక్ చేయండి. గడువు సెప్టెంబర్ 30వ తేదీ. అయితే ఇంకా 9 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ముందస్తుగానే గమనించి ఈ పనులు చేసుకుంటే బెటర్‌. తర్వాత ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండవచ్చు.

మార్చి 31, 2023న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఇతర చిన్న పొదుపు పథకాల కోసం ఆధార్ కార్డు, పాన్‌ కార్డు లను తప్పనిసరిగ్గా సమర్పించాలని సూచించింది. అయితే ఈ కొత్త స్కీమ్ కోరుకునే వారు మాత్రమే కాకుండా, ఇప్పటికే ఆ పథకాలు చేసిన వారు కూడా ఆధార్ కార్డు, పాన్‌ కార్డు తప్పకుండా సమర్పించాలి. సెప్టెంబర్ 30లోగా మీరు పథకం అందుకున్న పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖ కార్యాలయానికి వెళ్లి ఆధార్ నంబర్‌ను అందించాలి.

ఆధార్ సమర్పించకపోతే ఏమవుతుంది?

చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఆధార్, పాన్ నంబర్ ఇవ్వకపోతే పెట్టుబడి ఆగిపోతుంది. అంటే ఈ పథకాలలో పెట్టుబడి పెట్టిన మీ డబ్బు స్తంభింపజేయబడుతుంది. మీరు దానిని ఉపసంహరించుకోలేరు. వడ్డీ డబ్బులు కూడా జమ చేయడం లేదు. మీరు స్కీమ్‌లో డబ్బును డిపాజిట్ చేయడానికి కూడా పరిమితం చేయబడ్డారు.

ఇవి కూడా చదవండి

చిన్న పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే. ఇంతకు ముందు పథకాలను పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యేది కాదు. చాలా మంది ఆధార్‌ ను సమర్పించకుండానే పథకాన్ని ప్రారంభించారు. ఆధార్, పాన్‌ను సమర్పించడం ఇప్పుడు తప్పనిసరి. మీ ఆధార్‌తో పాన్ నంబర్ లింక్ చేయబడితే, మీరు ఆధార్ నంబర్ మాత్రమే ఇవ్వగలరు.

అయితే ప్రతి నెల 1వ తేదీ నుంచి కొత్త కొత్త నిబంధనలు అమలు అవుతూ ఉంటాయి. వినియోగదారులు ముందస్తుగా గమనించి పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రభుత్వాలు, ఆర్బీఐ విధించిన నిబంధనలు పాటించి ముందుకు వెళ్లాలి. ఇందులో ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఇలాంటి పనులను ముందస్తుగానే చేసుకోవాలి. ఎందుకంటే చివరి తేదీ వరకు ఆగితే తర్వాత ఏదో విధంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి