
డీప్సీక్ ఆర్1, చైనీస్ ఏఐ మోడల్ ఇది చాలా తక్కువ వ్యవధిలో వేగంగా ప్రజాదరణ పొందింది. చైనాకు వినియోగదారుల డేటాను పంపిందనే ఆరోపణలపై ఇప్పుడు డీప్ సీక్పై నిషేధం విధించారు. గత వారం సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టించిన ఏఐ సాధనం యూఎస్ అధికారులు భద్రతాపరమైన ప్రమాదాన్ని గుర్తించారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ జాతీయ భద్రతా సమస్యలను చూసిన తర్వాత అధికారికంగా ప్లాట్ఫారమ్ను ఏ ప్రభుత్వ పరికరాల్లో ఉపయోగించకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో డేటా గోప్యతా ప్రమాదాల కారణంగా చైనీస్ ఏఐ సాధనాలను పరిమితం చేయాలనే డిమాండ్లు మళ్లీ వెలుగులోకి వచ్చాయి.
డీప్సీక్ ఆర్1 కాకుండా టెక్సాస్ సంభావ్య ముప్పులుగా లేబుల్ చేసిప Xiaohongshu, రెడ్ నోట్, లెమన్ 8లను నిషేధించింది. ఈ ప్లాట్ఫారమ్లు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)తో ముడిపడి ఉన్నాయని ఆరోపించినందున, ఇది కీలకమైన యూఎస్ మౌలిక సదుపాయాలను రాజీ చేయగలదని గవర్నర్ అబాట్ పేర్కొన్నారు. సున్నితమైన వినియోగదారు డేటాను సేకరించేందుకు చైనా ఏఐ, సోషల్ మీడియాను ఉపయోగిస్తుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.
అమెరికాలో ఇటీవల టిక్ టాక్ తన సేవలను వెనక్కి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో అమెరికా యూజర్లకు Xiaohongshu బలమైన ప్రత్యామ్నాయంగా మారింది. దాదాపు 300 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న ఈ చైనీస్ యాప్ ఇప్పటికే చైనా, మలేషియా, తైవాన్లలో ప్రజాదరణ పొందింది. అయినప్పటికీ పెరుగుతున్న భద్రతా సమస్యల కారణంగా యూఎస్ అధికారులు ఇప్పుడు దాని కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్కు చెందిన నిషేధిత యాప్ లెమన్ 8 ఇప్పటికే వినియోగదారు డేటాను దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి