AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డును డిజిటలైజ్‌ చేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం.. కార్డు వల్ల ఎలాంటి లాభాలు!

Kisan Credit Card: గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ డెలివరీ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌ను డిజిటలైజ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పథకాన్ని..

Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డును డిజిటలైజ్‌ చేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం.. కార్డు వల్ల ఎలాంటి లాభాలు!
RBI
Subhash Goud
|

Updated on: Sep 03, 2022 | 2:19 PM

Share

Kisan Credit Card: గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ డెలివరీ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌ను డిజిటలైజ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పథకాన్ని ప్రారంభించనుంది. దీని కోసం మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) డిజిటలైజేషన్ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ నుండి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో ఉంచుకుని కిసాన్ క్రెడిట్ కార్డ్‌ల డిజిటలైజేషన్ కోసం దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం:

మధ్యప్రదేశ్, తమిళనాడులో ప్రారంభించబడిన పైలట్ ప్రాజెక్ట్ కింద బ్యాంకులలో వివిధ ప్రక్రియల ఆటోమేషన్, సర్వీస్ ప్రొవైడర్లతో వారి సిస్టమ్‌లను ఏకీకృతం చేయడంపై ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ డిజిటలైజేషన్ రుణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేయడంలో, రుణగ్రహీతల వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా రుణం కోసం దరఖాస్తు చేయడం నుండి దాని పంపిణీకి పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని ఆర్‌బీఐ చెబుతోంది. నాలుగు వారాల ఈ సమయాన్ని రెండు వారాలకు తగ్గించవచ్చు. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయం, అనుబంధ రంగాలు, అనుబంధ పరిశ్రమల ఆర్థిక అవసరాలను తీర్చగలగడం వల్ల రైతులను ఆర్థికంగా చేర్చడానికి గ్రామీణ రుణం చాలా ముఖ్యమైనది.

ఇవి కూడా చదవండి

పైలట్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, తమిళనాడులోని ఎంపిక చేసిన జిల్లాలలో వరుసగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్‌తో కలిసి అమలు చేయబడుతుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు పూర్తి సహకారం అందిస్తాయని.. రైతులకు సులువుగా ఆర్థికసాయం అందించాలనే ఉద్దేశంతో 1998లో కేసీసీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వంటి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు రుణాలు అందజేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్, 2020లో సవరించిన KCC పథకాన్ని ప్రారంభించారు. దీనిలో రైతులకు సకాలంలో రుణ మద్దతు అందించడానికి ఏర్పాటు చేయబడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి