AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: మెగా డీల్ తర్వాత అంబానీ తన భార్య నీతాకు రూ.70 వేల కోట్ల గిఫ్ట్

Mukesh Ambani: ఈ కంపెనీకి నీతా అంబానీ చైర్మన్‌గా మారారు. అయితే వీరికి సోనీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థల నుంచి సవాల్ ఎదురు కానుంది. ఈ మెగా డీల్ ప్రభావం

Mukesh Ambani: మెగా డీల్ తర్వాత అంబానీ తన భార్య నీతాకు రూ.70 వేల కోట్ల గిఫ్ట్
Subhash Goud
|

Updated on: Nov 15, 2024 | 5:44 PM

Share

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ భారీ డీల్‌ను పూర్తి చేశారు. ఏడాది సుదీర్ఘ చర్చల తర్వాత, రిలయన్స్ ఇండస్ట్రీస్ వయాకామ్ 18, డిస్నీ డీల్‌ను ఖరారు చేసింది. ఈ డీల్ విలువ 70 వేల 352 కోట్లు. ఈ ఒప్పందం డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ Voicom-18 లను ఒకచోట చేర్చింది. ఇప్పుడు రిలయన్స్ 2 OTT, 120 ఛానెల్‌లను కలిగి ఉంది. దీనికి 75 కోట్ల మంది వీక్షకుల డేటాబేస్ కూడా ఉంది. ఈ కొత్త కంపెనీ బాధ్యతలను ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీకి అప్పగించారు.

సంవత్సరానికి 26000 కోట్ల ఆదాయం:

70 వేల 352 కోట్ల విలువైన ఈ డీల్‌లో రిలయన్స్‌కు 63.16 శాతం వాటా ఉంది. డిస్నీకి 36.84 శాతం వాటా ఉంటుంది. ముగ్గురు సీఈవోలతో కలిసి నీతా అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తారు. ఈ జాయింట్ వెంచర్ మొత్తం విలువ రూ.70,000 కోట్లకు పైగా ఉండబోతోంది. ఏడాదికి రూ.26000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

నీతా అంబానీకి బాధ్యత

100 కంటే ఎక్కువ ఛానెల్‌లు, రెండు OTT ఛానెల్‌లను కలిగి ఉన్న ఈ మీడియా కంపెనీకి నీతా అంబానీ బాధ్యత వహిస్తారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి ఆయన చైర్మన్‌గా ఉంటారు. అలాగే ఈ కంపెనీలో ముగ్గురు సీఈవోలు ఉంటారు. ప్రస్తుత కెవిన్ వాజ్ ఈ వేదికపై ఎంటన్‌టైన్‌మెంట్‌ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. ఉమ్మడి డిజిటల్ సంస్థకు కిరణ్ మణి నాయకత్వం వహిస్తారు. అలాగే, జాయింట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్‌కు సంజోగ్ గుప్తా నాయకత్వం వహిస్తారు. ఈ కంపెనీకి ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

నీతా అంబానీ ముందు ఈ సవాల్:

ఈ కంపెనీకి నీతా అంబానీ చైర్మన్‌గా మారారు. అయితే వీరికి సోనీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థల నుంచి సవాల్ ఎదురు కానుంది. ఈ మెగా డీల్ ప్రభావం రిలయన్స్ షేర్లపైనా కనిపించనుంది. రిలయన్స్ షేర్లు రానున్న కాలంలో మంచి పురోగతిని సాధిస్తాయని ఇటీవల విదేశీ బ్రోకరేజ్ సంస్థ CVLA తెలిపింది. 70 శాతం వృద్ధిని రిలయన్స్ షేర్లు సాధించే అవకాశం ఉంది. అందువల్ల ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు రిలయన్స్ షేర్లపైనే ఉంటుంది.

ఇది కూడా చదవండి: MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హృదయాన్ని కదిలించిన అంధ యువకుని పాట.. కిరవాణి గారూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి