AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Lite: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. ఈ-మ్యాండెట్ ప్రకటన

2016లో నోట్ల రద్దు సమయం తర్వాత ఎన్‌పీసీఐ సహకారంతో యూపీఐ సేవలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో తీసుకునివచ్చింది. యూపీఐ రాకతో భారతదేశంలో చిల్లర సమస్య తీరింది. అయితే యూపీఐ చెల్లింపులు ముఖ్యంగా నెట్‌వర్క్ సదుపాయానికి అనుగుణంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్ లేని ప్రాంతాలతో పాటు తక్కువగా ఉండే ప్రాంతాల్లో చెల్లింపులు చేయడం సగటు యూజర్‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఎన్‌పీసీఐ యూపీఐ లైట్ సేవలను తీసుకొచ్చింది.

UPI Lite: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. ఈ-మ్యాండెట్ ప్రకటన
Upi
Follow us
Srinu

|

Updated on: Jun 08, 2024 | 7:45 PM

భారతదేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు అధిక స్థాయిలో ఉన్నాయి. ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ప్రజలు వీటిని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా 2016లో నోట్ల రద్దు సమయం తర్వాత ఎన్‌పీసీఐ సహకారంతో యూపీఐ సేవలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో తీసుకునివచ్చింది. యూపీఐ రాకతో భారతదేశంలో చిల్లర సమస్య తీరింది. అయితే యూపీఐ చెల్లింపులు ముఖ్యంగా నెట్‌వర్క్ సదుపాయానికి అనుగుణంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్ లేని ప్రాంతాలతో పాటు తక్కువగా ఉండే ప్రాంతాల్లో చెల్లింపులు చేయడం సగటు యూజర్‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఎన్‌పీసీఐ యూపీఐ లైట్ సేవలను తీసుకొచ్చింది. యూపీఐ లైట్ అనేది యూపీఐ వ్యాలెట్. దీని ద్వారా నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇటీవల ఆర్‌‌బీఐ యూపీఐ లైట్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ లైట్ ఈ-మ్యాండెట్‌ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది.ఈ నేపథ్యంలో యూపీఐ ఈ-మ్యాండెట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

యూపీఐ లైట్ చెల్లింపుల్లో అంతరాయం లేని వ్యవస్థను రూపొందించడానికి యూపీఐ లైట్ ఈ-మ్యాండెట్‌ను ప్రవేశపెట్టినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆన్-డివైస్ వాలెట్ ద్వారా త్వరగా, సజావుగా చిన్న విలువ చెల్లింపులను ప్రారంభించడానికి యూపీఐ లైట్ సెప్టెంబర్ 2022లో ప్రవేశపెట్టబడింది. ప్రస్తుతం యూపీఐ లైట్ రోజువారీ పరిమితి రూ. 2,000గా ఉంటే ఒకే చెల్లింపుకు గరిష్ట పరిమితి రూ. 500గా ఉంది.  యూపీఐ లైట్‌ని విస్తృతంగా స్వీకరించడాన్ని ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ వినియోగదారులు నిర్ణయించిన థ్రెషోల్డ్ పరిమితి కంటే తక్కువగా ఉంటే వారి యూపీఐ లైట్ వాలెట్‌లను ఆటోమేటిక్‌గా తిరిగి నింపుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దానిని ఇ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకురావాలని ప్రతిపాదించింది. ఇది చిన్న-విలువ డిజిటల్ చెల్లింపుల సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

యూపీఐ లైట్ అంటే రూ. 500 కంటే తక్కువ విలువైన లావాదేవీలను నిర్వహించడానికి రూపొందించబడిన చెల్లింపు పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. యూపీఐ లైట్ ఈ చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి విశ్వసనీయమైన ఎన్‌పీసీఐ కామన్ లైబ్రరీ అప్లికేషన్‌ను ఉపయోగిస్తుంది, స్థిరత్వం, సమ్మతితో పాటు విస్తృత అంగీకారాన్ని నిర్ధారించడానికి మొబైల్ ఫోన్‌లలో ఇప్పటికే ఉన్న యూపీఐ చెల్లింపు వ్యవస్థతో సజావుగా ఏకీకృతం చేస్తుంది. యూపీఐ లైట్ చిన్న లావాదేవీల కోసం వినియోగదారుల స్నేహపూర్వక అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. రిమిటర్ బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ల ద్వారా రియల్ టైమ్ ప్రాసెసింగ్ అవసరం లేకుండా చెల్లిపులు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెల్లింపుల సమయంలో రిస్క్ తగ్గించవచ్చని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..