AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Scheme: నెలకు రూ. 500 పెట్టుబడితో మెచ్యూరిటీ తర్వాత రూ. 4.12 లక్షలు.. ఎలాగంటే

మీరు డబ్బు సంపాదించాలంటే పెట్టుబడి అవసరం. ఏయే రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే మంచి లాభాలు ఉంటాయన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆదాయానికి అనుగుణంగా మీరు ఏ పెట్టుబడిని ప్రారంభించవచ్చు..? ఎందుకంటే పెట్టుబడి మాత్రమే మీ డబ్బును పెంచుతుంది. మీరు డబ్బును ఆదా చేసి, దానిని సురక్షితంగా ఉంచినట్లయితే, వచ్చే ఆదాయం మరింతగా పెరుగుతుంది...

Post Office Scheme: నెలకు రూ. 500 పెట్టుబడితో మెచ్యూరిటీ తర్వాత రూ. 4.12 లక్షలు.. ఎలాగంటే
Post Office Scheme
Subhash Goud
|

Updated on: Jul 17, 2024 | 5:31 PM

Share

మీరు డబ్బు సంపాదించాలంటే పెట్టుబడి అవసరం. ఏయే రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే మంచి లాభాలు ఉంటాయన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆదాయానికి అనుగుణంగా మీరు ఏ పెట్టుబడిని ప్రారంభించవచ్చు..? ఎందుకంటే పెట్టుబడి మాత్రమే మీ డబ్బును పెంచుతుంది. మీరు డబ్బును ఆదా చేసి, దానిని సురక్షితంగా ఉంచినట్లయితే, వచ్చే ఆదాయం మరింతగా పెరుగుతుంది.

ఇండియన్ పోస్ట్ ఆఫీస్‌లో ఇటువంటి అనేక పథకాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో మీరు రూ. 500 కంటే తక్కువ పెట్టుబడిని ప్రారంభించి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న మొత్తంతో ప్రారంభించండి, ఆపై మీ ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడిని పెంచుకోండి. డబ్బు సంపాదించడానికి ఇదే మార్గం. మీరు రూ. 500 లోపు పెట్టుబడిని ప్రారంభించగల పోస్టాఫీసులో ఉన్న కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.

పీపీఎఫ్‌:

ఇవి కూడా చదవండి

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) అనేది దీర్ఘకాలిక పథకం. ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అలాగే 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. మీకు కావాలంటే, మెచ్యూరిటీ తర్వాత మరో 5 సంవత్సరాల మెచ్యూరిటీని పొడిగించవచ్చు. మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఏటా రూ. 6,000 ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా మీరు 7.1 శాతం వడ్డీతో 15 సంవత్సరాలలో రూ. 1,62,728 జోడించవచ్చు. 5-5 ఏళ్లు పొడిగిస్తే 20 ఏళ్లలో రూ.2,66,332, అదే 25 ఏళ్లలో రూ.4,12,321 జోడించవచ్చు.

సుకన్య సమృద్ది యోజన:

మీరు మీ కుమార్తె పేరు మీద సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో ఏటా కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం దానిపై 8.2 శాతం వడ్డీ ఇస్తోంది. మీరు ఈ పథకంలో 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. 21 సంవత్సరాల తర్వాత పథకం మెచ్యూర్ అవుతుంది. ఇందులో నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ.90,000 ఇన్వెస్ట్ చేస్తే 8.2 శాతం వడ్డీతో 21 ఏళ్ల తర్వాత రూ.2,77,103 పొందుతారు.

రికరింగ్‌ డిపాజిట్‌:

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. అనేది పిగ్గీ బ్యాంక్ లాంటిది. దీనిలో ప్రతి నెలా నిర్ణీత మొత్తం పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం చిన్న పెట్టుబడిదారులకు వారి భవిష్యత్ అవసరాలను తీర్చడానికి కార్పస్‌ను రూపొందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ. 100తో కూడా ప్రారంభించవచ్చు. ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత 5 ఏళ్లపాటు నిరంతరంగా ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు 6.7%. మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే, మీరు 5 సంవత్సరాలలో రూ. 30,000, ఐదు సంవత్సరాల తర్వాత మీకు 6.7 శాతం చొప్పున రూ. 35,681 అంటే వడ్డీగా రూ. 5,681 పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి