PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ డబ్బులు రావు.. ఎందుకో తెలుసా?

|

Jun 10, 2024 | 4:34 PM

ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాల్లో పీఎం కిసాన్‌ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున లబ్ది పొందుతున్నారు. ఈ డబ్బులు కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం.

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ డబ్బులు రావు.. ఎందుకో తెలుసా?
Pm Kisan
Follow us on

ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాల్లో పీఎం కిసాన్‌ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున లబ్ది పొందుతున్నారు. ఈ డబ్బులు కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు రైతులు 16వ విడత వరకు డబ్బులు అందుకున్నారు. ఇక మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశంలోని 9 కోట్ల మందికి పైగా రైతులకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద కానుకను అందించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడతగా రూ.20 వేల కోట్లు విడుదలయ్యాయి. తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు.

పీఎం కిసాన్‌ యోజన ప్రయోజనం అందుకునే రైతులు కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ చేయని రైతులకు 17వ విడత డబ్బులు అందవని కేంద్రం చెబుతోంది. అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వాయిదా ఆగిపోతుంది. రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు చెబుతూ వస్తోంది. కొందరు రైతులు కేవైసీ చేయలేదని, వారికి వచ్చే విడత డబ్బులు అందవని స్పష్టం చేస్తోంది. అందుకే ఈ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

ఈ పథకానికి వీరు అనర్హులు:

ఈ పథకం కుటుంబంలోని భర్త, భార్య, వారి మైనర్ పిల్లలకు వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి ఉన్నత ఆర్థిక స్థితికి చెందినవారు అనర్హులు అని కేంద్రం తెలిపింది. అలాగే మరికొందరు కూడా ఈ పథకానికి అనర్హులు. వారెవరంటే..

  1. మాజీ, ప్రస్తుతం రాజ్యంగ పదవులు కలిగి ఉన్న రైతు కుటుంబాలు.
  2. మాజీ, ప్రస్తుత మంత్రులు, పార్లమెంట్, శాసనసభ్యులుగా ఉన్న కుటుంబాలు.
  3. రాష్ట్ర శాసన మండలి సభ్యుల కుటుంబాలు, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత మేయర్ , జిల్లా పంచాయితీల మాజీ,ప్రస్తుత అధ్యక్షుల కుటుంబాలు.
  4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ప్రస్తుతం పనిచేస్తున్నవారు పదవి విరమణ పొందిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు.
  5. కేంద్ర లేదా రాష్ట్ర PSEలు, అనుబంధిత కార్యాలయాలు లేదా కేంద్రం పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థలలో ప్రస్తుత లేదా మాజీ అధికారులు. (స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు, మల్టీ టాస్కింగ్ సిబ్బంది, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులు మినహా).
  6. నెలవారీ పెన్షన్ రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ తీసుకునేవారు అనర్హులు.
  7. గత అసెస్‌మెంట్ సంవత్సరాల్లో ఆదాయపు పన్ను చెల్లించిన వారు.
  8. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు వంటి ఉద్యోగులకు కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు.

అయితే ఇప్పటివరకు పీఎం కిసాడ్ డబ్బులు పొందిన అర్హత లేనివారు ఇక ఆ నగదును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా వీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్‏కు లాగిన్ అయ్యి.. అక్కడ “రిఫండ్ ఆప్షన్ ” పై క్లిక్ చేయాలి. దీంతో వారు ఇప్పటివరకు పొందిన నగదును కేంద్రానికి తిరిగి ఇవ్వచ్చు.

పీఎం కిసాన్‌లో లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా తనిఖీ చేయాలి?

  • PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – https://pmkisan.gov.in/
  • పేజీ కుడి మూలన ఉన్న ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్ మరియు గ్రామం వంటి డ్రాప్-డౌన్ నుండి వివరాలను ఎంచుకోండి
  • ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • లబ్ధిదారుల జాబితా వివరాలు మీకు కనిపిస్తాయి.

eKYCని ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • పేజీ కుడి వైపున అందుబాటులో ఉన్న eKYC ఎంపికపై క్లిక్ చేయండి
  • ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి
  • ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
  • ‘గెట్ OTP’పై క్లిక్ చేసి, నిర్దిష్ట ఫీల్డ్‌లో OTPని నమోదు చేయండి

ఫిర్యాదు ఎలా దాఖలు చేయాలి?

పిఎం కిసాన్ కింద 16వ విడత రూ. 2,000 అందుకోని అర్హులైన రైతు ఎవరైనా పిఎం కిసాన్ హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేయవచ్చు. మీరు సోమవారం నుండి శుక్రవారం వరకు ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఇమెయిల్ పంపడం ద్వారా కూడా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.

ఇమెయిల్ ID: pmkisan-ict@gov.in. మరియు pmkisan-funds@gov.in లేదా ఎం-కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261/011-24300606, పీఎం కిసాన్ టోల్-ఫ్రీ నంబర్ 1800-115-526.