Petrol, Diesel Prices Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి..? తాజా రేట్ల వివవరాలు

|

Oct 17, 2022 | 11:43 AM

దేశంలో పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో విధించే పన్ను వల్ల స్వల్ప..

Petrol, Diesel Prices Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి..? తాజా రేట్ల వివవరాలు
Petrol Diesel Price Today
Follow us on

దేశంలో పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో విధించే పన్ను వల్ల స్వల్ప మార్పులు ఉంటాయి తప్పా పెద్దగా తేడా ఉండదు. మే 22వ తేదీ తర్వాత బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వందకుపైగానే ధరలు నమోదు అవుతున్నాయి. తాజాగా అక్టోబర్‌ 17వ తేదీని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.35, డీజిల్‌ ధర రూ.94.28

ఇవి కూడా చదవండి

కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.03, డీజిల్‌ ధర రూ.92.76

చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.63, డీజిల్‌ ధర రూ.94.24

బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.94, డీజిల్‌ ధర రూ.87.89

హైదరాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.94.62

విశాఖలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.64, డీజిల్‌ ధర రూ.98.42.

అయితే ఏపీలో పలు ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. అలాగే దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను విధింపు నేపథ్యంలో చిన్నపాటి తేడాలు ఉంటాయి.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చెక్‌ చేసుకోండిలా..

ఇక మీరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చెక్‌ చేసుకోవాలంటే మీరు ఇంట్లోనే ఉండి చేసుకునే సదుపాయం కూడా ఉంది. కేవలం మొబైల్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. ధరను చెక్‌ చేయడానికి ఇండియన్ ఆయిల్ (ఐఓసీ) వినియోగదారు RSP<డీలర్ కోడ్> అని రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. అదే సమయంలో, HPCL వినియోగదారులు 9222201122 నంబర్‌కు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేయడం ద్వారా, అలాగే BPCL (BPCL) వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేయడం చేసి 9223112222కు SMS పంపండి. ధరలను తెలుసుకునేందుకు ఈ లింక్‌ ద్వారా కోడ్‌ను తెలుసుకోవచ్చు.

మే22న ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన కేంద్రం

మే 22వ తేదీన కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలో చివరి మార్పు జరిగింది. మే 21న లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గింపును ప్రకటించారు. ఈ తగ్గింపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.8.69, డీజిల్ ధర రూ.7.05 తగ్గింది.

పెట్రోల్‌పై ట్యాక్స్‌

రాజధాని ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉంది. ఇందులో బేస్ ధర రూ.57.13. లీటరుకు 20 పైసలు ధర. ఎక్సైజ్ సుంకం రూ.19.90, వ్యాట్ లీటరుకు రూ.15.71. డీలర్ కమీషన్ లీటరుకు రూ.3.78. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పన్ను రేటు 15 జూన్ 2022 ఆధారంగా ఉంటుంది.

డీజిల్‌పై ట్యాక్స్‌

మరోవైపు రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. దీని మూల ధర లీటరుకు రూ.57.92. లీటరు ధర రూ.0.22, ఎక్సైజ్ డ్యూటీ రూ.15.80, వ్యాట్ రూ.13.11. డీలర్ కమీషన్ లీటరుకు రూ.2.57. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పన్ను రేటు 15 జూన్ 2022 ఆధారంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి