Hybrid Vehicles: పదేళ్లలో పెట్రోల్, డీజిల్ కార్లు తెరమరుగు, కేంద్రమంత్రి మాటలు నిజమవుతాయా..

గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ పెట్రోలు, డీజిల్ వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. అయితే రానున్న కాలంలో మన దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాలు తెరమరుగుకానున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాల అమ్మకాలు లేవు అని ఆయన అన్నారు.

Hybrid Vehicles: పదేళ్లలో పెట్రోల్, డీజిల్ కార్లు తెరమరుగు, కేంద్రమంత్రి మాటలు నిజమవుతాయా..
Petrol
Follow us

|

Updated on: Jun 07, 2024 | 4:57 PM

మన దేశంలో సాధారణంగా పెట్రోలు, డీజిల్ తో నడిచే వాహనాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని కొనుగోలు చేయడానికే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ అది పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ పెట్రోలు, డీజిల్ వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. అయితే రానున్న కాలంలో మన దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాలు తెరమరుగుకానున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాల అమ్మకాలు లేవు అని ఆయన అన్నారు.

పెరిగిన ఈవీల వినియోగం..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈవీలకు ప్రజల ఆదరణ పెరిగింది. అయితే ఇవి చార్జింగ్ మౌలిక సదుపాయాలలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీనికి పరిష్కారంగా హైబ్రిడ్ వాహనాలను నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. దేశంలో ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించారు. రాబోయే దశాబ్దంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిలిపివేయడం దాని ఉద్దేశం.

కష్టమే గానీ అసాధ్యం కాదు..

ఇటీవల జరిగిన బహిరంగ ర్యాలీలో గడ్కరీ ఈ విషయాలను ప్రస్తావించారు. వచ్చే పదేళ్లలో డీజిల్, పెట్రోల్ వాహనాలను పూర్తిగా తొలగిస్తామన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను సూచించారు. వాటికి పెరుగుతున్న ఆదరణపై కూడా మాట్లాడారు. రూ.వంద డీజిల్‌ తో ప్రయాణించే దూరాన్ని కేవలం రూ.4 విద్యుత్‌ను ఉపయోగించి వెళ్లవచ్చని సూచించారు. దీనిలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్ టీ తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేసే విషయం కష్టమే గానీ, అసాధ్యం కాదన్నారు.

చార్జింగ్ సమస్యలు..

దేశంలో దాదాపు రెండేళ్లగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది. ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈవీ ఛార్జింగ్ కోసం ప్రస్తుత మౌలిక సదుపాయాలు సరిపోవడం లేదు. వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వాహనాలు మధ్యంతర పరిష్కారాన్ని అందిస్తున్నాయి.

హైబ్రిడ్ కారు అంటే..

హైబ్రిడ్ కారు అంటే సంప్రదాయ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు ఇంజిన్ కలయిక అని భావించవచ్చు. పెట్రోలు, డీజిల్ ఇంజిన్ కు ఎలక్ట్రిక్ మోటారుకు అమర్చుతారు. కారు ఇంధన సామర్థ్యం మెరుగుపర్చడం దీని ఉద్ధేశం. మామూలు కార్ల కంటే హైబ్రిడ్ వాహనాలు ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి. వీటి వల్ల ఇంధన వినియోగం, గ్రీన్ హౌస్ ఉధ్గారాలను తగ్గించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!