AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: పన్ను చెల్లింపు ఇక మరింత సులభం.. బ్యాంకుల జాబితా విడుదల

భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక పౌరులు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్నుదారులకు పెరిగిన టెక్నాలజీ ద్వారా సౌలభ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలను తీసుకుంటుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లింపు విధానాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఈ నేపథ్యం ఈ-పే ద్వారా పన్ను చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

Income Tax: పన్ను చెల్లింపు ఇక మరింత సులభం.. బ్యాంకుల జాబితా విడుదల
Income Tax
Nikhil
|

Updated on: Mar 09, 2025 | 6:39 PM

Share

భారతదేశంలోని ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసే వారి కోసం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈ-పే పన్ను సేవలకు అందుబాటులో ఉన్న 30 బ్యాంకుల జాబితాను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. ఈ సారి ఈ-పే పన్ను సేవల కోసం రెండు కొత్త బ్యాంకులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌తో పాటు తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్ ద్వారా కూడా ఈ-పే పన్ను సేవలను పొందవచ్చు. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో వివరాలను అప్‌గ్రేడ్ చేశారు. తాజా చర్యలతో మొత్తం 30 బ్యాంకులు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ పన్ను చెల్లింపులకు అందుబాటులో ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, జమ్ము & కాశ్మీర్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్ ద్వారా ఈ-పే పన్ను సేవలను పొందవచ్చు. 

ఈ-పే టాక్స్ సర్వీస్ అంటే?

ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని ఈ-పే టాక్స్ సర్వీస్ అనేది పన్ను చెల్లింపుదారులు తమ పన్నులను డిజిటల్‌గా చెల్లించడానికి వీలుగా భారత ఆదాయపు పన్ను శాఖ అందించే ఆన్‌లైన్ సౌకర్యం. ఈ సేవ ద్వారా వ్యక్తులు, వ్యాపారులు, ఇతర సంస్థలకు ముందస్తు పన్ను, స్వీయ-అంచనా పన్ను, సాధారణ అసెస్‌మెంట్ పన్ను, టీడీఎస్/టీసీఎస్ చెల్లింపులు వంటి ప్రత్యక్ష పన్నులను చెల్లించడానికి, వారి బ్యాంక్ ఖాతాల నుండి చెల్లింపులను సౌకర్యవంతంగా చెల్లించడానికి అనుమతి ఉంటుంది. అలాగే పన్ను చెల్లింపుదారులు అనధికార బ్యాంకుల ద్వారా నెఫ్ట్/ఆర్టీజీఎస్, ఈ-పే వద్ద చెల్లింపు గేట్‌వే ద్వారా ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని పన్ను సేవ ద్వారా చెల్లింపు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఐటీఆర్ ఫైలింగ్ ఏప్రిల్ 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆఫ్‌లైన్ యుటిలిటీలు, ఆన్‌లైన్ ఫారమ్‌లు ప్రారంభించబడినప్పుడు, ఆదాయపు పన్ను శాఖ తన వెబ్‌సైట్‌లో తెలియజేస్తుంది. ఆడిట్ అవసరం లేని వారికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2025గా ఉంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us