AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Scheme: రోజుకు రూ. 50 సేవ్‌ చేయండి, రూ. 35 లక్షలు మీ సొంతం చేసుకోండి.. అదిరిపోయే పోస్టాఫీస్‌ స్కీమ్‌..

భవిష్యత్‌ భరోసాగా ఉండాలంటే కచ్చితంగా సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలనే విషయం తెలిసిందే. సంపాదించేది కొంచమైనా పొదుపు చేసుకునే అలవాటు ఉంటేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఇలా డబ్బు ఆదా చేసుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని..

Post Office Scheme: రోజుకు రూ. 50 సేవ్‌ చేయండి, రూ. 35 లక్షలు మీ సొంతం చేసుకోండి.. అదిరిపోయే పోస్టాఫీస్‌ స్కీమ్‌..
Post Office Scheme
Narender Vaitla
|

Updated on: Nov 04, 2022 | 8:30 AM

Share

భవిష్యత్‌ భరోసాగా ఉండాలంటే కచ్చితంగా సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలనే విషయం తెలిసిందే. సంపాదించేది కొంచమైనా పొదుపు చేసుకునే అలవాటు ఉంటేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఇలా డబ్బు ఆదా చేసుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని రిస్క్‌ ఎక్కువ ఉన్నవి అయితే.. మరికొన్ని ఎలాంటి రిస్క్‌ లేనివి. ఇలాంటి రిస్క్‌ లేని స్కీమ్స్‌లో ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ మంచి ఆప్షన్‌ అని చెప్పొచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇలాంటి సేవింగ్స్‌ పథకాల్లో పోస్టాఫీస్ గ్రామీణ సురక్ష యోజన స్కీమ్ ఒకటి. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు.? ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

గ్రామీణ సురక్ష యోజన పథకం కింద పాలసీదారుడు నెలకు రూ. 1515 చెల్లిస్తూ.. 55 ఏళ్ల టర్మ్‌ పాలసీ తీసుకుంటే మెచ్చూరిటీ సమయానికి మొత్తం 10 లక్షలు అవుతుంది. అయితే దీనికి ఇతర బెనిఫిట్స్ కలుపుకుని పాలసీదారుడికి మొత్తం రూ. 31,60,000 అందుతుంది. ఒకవేళ 60 ఏళ్ల టర్మ్‌కి పాలసీ తీసుకుంటే బెనిఫిట్స్‌తో కలిపి మొత్తం రూ. 34.60 లక్షలు పొందొచ్చు. ఈ పాలసీలో తీసుకోవడానినికి పాలసీదారుడి వయసు కనీసం 19 ఏళ్లు, గరిష్టం 55 ఏళ్లు ఉండాలి. కనీసం మొత్తం రూ. 10 వేల నుంచి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ఉంటుంది. పాలసీదారుడు నాలుగేళ్ల తర్వాత రుణ సదుపాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒకవేళ పాలసీదారుడు ఐదేళ్ల కంటే ముందే పథకం నుంచి వీడినట్లైతే బోన్‌ వర్తించదు.

ఇక పాలసీదారుడు 59 ఏళ్ల వయసు వరకు పాలసీని ఎండోమెంట్ అసూరెన్స్ పాలసీగా మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే ప్రీమియం చెల్లింపు నిలిచిపోయిన ఏడాది వరకు లేదా మెచ్యూరిటీ నిండిన ఏడాది లోపు ఎండోమెంట్ అసూరెన్స్ పాలసీగా మార్చుకునే అవకాశం ఉండదు. 55, 58, 60 ఏళ్ల వరకు ప్రీమియంను చెల్లించే అవకాశం ఉంటుంది. గ్రామీణ సురక్ష యోజన పథకంలో ప్రతీ ఏడాదికి రూ. 1000 మొత్తానికి రూ. 60 బోనస్‌గా ఉంటుంది. అయితే పాలసీదారుడు మెచ్చూరిటీ కంటే ముందే పాలసీని సరెండర్‌ చేస్తే మాత్రం బోన్‌ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి