Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inflation: రుతుపవనాల రాక, వడ్డీ రేట్ల పెంపు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

రుతుపవనాల ఆగమనం వ్యవసాయ ఉత్పత్తి పెంచవచ్చనే అంచనా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం వల్ల అధిక ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందవచ్చని ఆర్థికవేత్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు...

Inflation: రుతుపవనాల రాక, వడ్డీ రేట్ల పెంపు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Inflation
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 20, 2022 | 7:24 AM

రుతుపవనాల ఆగమనం వ్యవసాయ ఉత్పత్తి పెంచవచ్చనే అంచనా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం వల్ల అధిక ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందవచ్చని ఆర్థికవేత్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు, ఇంధనం ధరల కారణంగా ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని మరింత తగ్గించడం వంటి ఆర్థిక చర్యలతో ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని కూడా నియంత్రించగలిగినప్పటికీ, ధరల నియంత్రణకు ద్రవ్య విధానానికి ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది ప్రాతిపదికన 7.04 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 7.79 శాతంగా ఉంది. మరోవైపు మే నెలలో టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.88 శాతానికి ఎగబాకింది. ధరల పెరుగుదలలో నాల్గో వంతు ఆహార పదార్థాల నుండి వస్తోంది. సాధారణ రుతుపవనాల వల్ల ఉపశమనం పొందవచ్చని భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే కీలకమైన పాలసీ రేటు రెపోను 0.90 శాతం పెంచిందని, రానున్న కాలంలో ఇది 0.80 శాతం పెరగవచ్చని ఆయన అన్నారు.

ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ద్రవ్యోల్బణం పెరగడానికి గ్లోబల్ కమోడిటీ ధరలు ప్రధాన చోదక కారకంగా ఉన్నాయని ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ ఎకనామిస్ట్ విశ్రుత్ రాణా అన్నారు. ఇంకా ఆహార ధరలు రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. మెరుగైన రుతుపవనాలు వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతాయి. ధరలను అదుపులో ఉంచుతాయి. తక్కువ ఎక్సైజ్ సుంకం, తక్కువ విలువ ఆధారిత పన్ను లేదా వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యక్ష సబ్సిడీ వంటి కొన్ని అదనపు పాలసీ ఎంపికలు ఉన్నాయని రాణా చెప్పారు. అయితే ప్రస్తుతానికి ద్రవ్య విధానానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. పాలసీ రేట్లను 0.75 శాతం పెంచాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. భారత్‌ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ సునీల్‌ సిన్హా మాట్లాడుతూ.. నికర వస్తువుల దిగుమతిదారుగా భారత్‌ ఈ విషయంలో పెద్దగా ఏమీ చేయలేదని అన్నారు. అయితే, ప్రభావాన్ని తగ్గించేందుకు దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చు.

మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే
దిమ్మతిరిగే ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్..
దిమ్మతిరిగే ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్..
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
కోపంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. డేంజర్
కోపంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. డేంజర్
వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి
వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..
4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు
4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్