20 April 2025
Subhash
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త నిబంధనలతో మార్పుల గురించి చాలా రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి.
ఇప్పుడు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ దీనిపై అప్డేట్ ఇచ్చారు. ఆయన ఈపీఎఫ్వో 3.0 గురించి ఒక ప్రకటన చేశారు.
ఈపీఎఫ్వో తీసుకువస్తున్న ఈ కొత్త నియమాల కారణంగా చెల్లింపు, ఖాతాకు సంబంధించిన అనేక నియమాలలో మార్పులు ఉంటాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కొత్త అప్డేట్తో ఉద్యోగులు ఏటీఎం ద్వారా డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
ఈపీఎఫ్వో చేపడుతున్న కొత్త మార్పుల కారణంగా దేశంలోని 9 కోట్ల మందికిపైగా ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.
రాబోయే రోజుల్లో కొత్త వెర్షన్ 3.0పై క్లెయిమ్ల ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుందని, ఈపీఎఫ్వో కింద ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈపీఎఫ్వో 3.0 మే లేదా జూన్ నెలలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి.
దీంతో పాటు ఈపీఎఫ్వో ఉద్యోగులు ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. దీని వల్ల ఉద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.