AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా

Kurnool: ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా

J Y Nagi Reddy

| Edited By: Ravi Kiran

Updated on: Apr 24, 2025 | 10:55 AM

కర్నూలు జిల్లాలో నాగుపాము కలకలం రేపింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి లోని పిల్లల వార్డు లోకి వచ్చి ప్రజలను బెంబేలెత్తించింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓసారి లుక్కేయండి మరి..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం రేపింది. చిన్నపిల్లల వార్డులో ఒక్కసారి 6 అడుగుల ఉన్న నాగుపాము ప్రత్యక్షం కావడంతో అక్కడున్న రోగులందరూ భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. వెంటనే అక్కడ ఉన్న రోగుల బంధువులు ఆ పామును వెంటాడి, ముందుగా పిల్లల వార్డులో నుంచి బయటకు వచ్చేలా చేసి దానిని చంపడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆసుపత్రి ఆవరణ చుట్టూ అపరిశుభ్రంగా ఉండడంతో ఇలా విషపురుగులు నిత్యం వస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం సమయంలో కాబట్టి పాము కనపడిందని.. రాత్రి సమయంలో అయితే చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు స్పందించి ఆస్పత్రి ఆవరణ చుట్టూ శుభ్రంగా ఉండేలా చూడాలని రోగులు కోరారు.